Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నటువంటి పేరు. ముంబై కి చెందినటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో ఈ సినిమాలో ఈమె మై డియర్ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక ఈ సాంగులో నటించినటువంటి ఈమె ఈ సినిమా విడుదలవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా పవన్ ఆంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమె పాత వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈమె గతంలో కూడా కొంతమంది హీరోలను సీఎం అంటూ సంబోధించడం గమనార్హం.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు వేశారు ఒకవేళ మీరు కనుక ఓటు వేయాలనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అంటూ ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…