Tag Archives: vacation

Vijay Devarakonda -Rashmika: మరొకసారి జంటగా వెకేషన్ వెళ్లిన విజయ్ రష్మిక… వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda -Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండటం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి కొంతమంది పెళ్లి చేసుకొని విడిపోయారు. తాజాగా టాలీవుడ్లో హీరో హీరోయిన్లు ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో హీరోయిన్ మరెవరో కాదు… గీత గోవిందం సినిమాలో జంటగా నటించిన హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన.

గీత గోవిందం, డియర్ కామ్రేడ్స్ సినిమాలో కూడా నటించారు. ఇలా రెండు సినిమాలలో జంటగా నటించడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఇద్దరు కలిసి జంటగా విదేశాలలో వెకేషన్స్ ఎంజాయ్ చేయటంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా వీరిద్దరూ మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చక్కర్లు కొట్టాయి.

ఈ వార్తల గురించి రశ్మిక స్పందిస్తూ తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదనీ స్పష్టం చేశారు. కానీ ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. ఇక తాజాగా వీరి ప్రేమ వార్తలు మరొక సారి వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తాజాగా ఇద్దరూ కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

Vijay Devarakonda -Rashmika: దుబాయ్ వెకేషన్ లో విజయ్ రష్మిక…

తాజాగా విజయ్ తన కుటుంబంతో కలిసి దుబాయిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే విజయ్ కుటుంబంతో పాటు రష్మిక కూడా వారితో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రష్మిక తరచూ విజయ్ ఇంటికి వెళ్తూ వచ్చేది. ఇక ఇప్పుడు ఇలా విజయ కుటుంబంతో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేయటంతో వీరి ప్రేమ గురించి వస్తున్న వార్తలు నిజమేనని నెటిజన్ లు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్‌.. ఏమైందంటే..?

Pooja Family Vacation: వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్న ఫిలిం స్టార్లకు మాల్దీవులు మంచి డెస్టినేషన్ గా మారాయి. సమయం చిక్కినప్పుడల్లా చాలా మంది అక్కడికి చెక్కెస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ.. బీచ్ లో బికినీ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఈఫోటోలు చూసిన కుర్రాళ్ల మతులు పోయాయి. తాజాగా మరో హీరోయిన్ పూజా హెగ్డే కూడా మాల్దీవుల వెకేషన్ కు వెళ్లింది. గతేడాది నవంబర్ లో కూడా మాల్దీవులకు వెళ్లిన ఈ బన్నీ హీరోయిన్.. అప్పుడు తన బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది. తన అందాలతో యూత్ ను కట్టిపడేసింది. అప్పట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్‌.. ఏమైందంటే..?

ప్రస్తుతం మరోసారి ఈ అమ్మడు మాల్దీవులకు వెళ్లింది. అయితే ఈసారి మాత్రం ఒంటరిగా కాదు.. తన ఫ్యామిలీతో ట్రిప్ కి చెక్కేసింది. వరసగా షూటింగ్ లకు విరామం దొరకడంతో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు తన సోదరుడితో మాల్దీవుల్లో తెగ హల్చల్ చేస్తోంది ఈ బ్యూటి. 

Pooja Family Vacation: 13ఏళ్ల తర్వాత మమ్మీ కోసం అంత పనిచేసిన బన్నీ హీరోయిన్‌.. ఏమైందంటే..?

దాదాపు 13 ఏళ్ల తరువాత ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లినట్లు చెప్పింది పూజా హెగ్డే. అంటే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత మొదటి సారి అని అర్థం అవుతోంది. మాల్దీవుల్లో బోట్ వద్ద..తన తల్లిదండ్రులు, సోదరుడితో దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. 

అయితే ఓ ఆశక్తికర విషయాన్ని వెల్లడించింది పూజా. తన తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేయడానికే వెకేషన్ కి వెళ్లిందట. ఇన్స్టాగ్రామ్ లో వారి ఫోటోలను షేర్ చేస్తూ.. ఆశక్తికర విషయాలను వెల్లడించింది. తమ అమ్మ పుట్టిన రోజు మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేయాలని ప్లాన్‌ చేసింది పూజా. సింపుల్‌గానే బర్త్ డే కేక్‌ కూడా కట్‌ చేయించారు. మరోవైపు తన సోదరుడు రిషబ్‌ హెగ్డేతోనూ ఫోటోని షేర్ చేస్తూ లెస్ గో అంటూ.. కామెంట్ పెట్టింది. 

నాన్న గురించి అలాంటి కామెంట్ చేసిన పూజ..

నాజీవితంలో అత్యంత డ్రామాటిక్ పర్సన్ అంటూ కామెంట్ పెట్టింది.  ప్రస్తుతం పూజా చేతిలో చేతి నిండా సినిమాాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘రాధేశ్యాం’, ‘ఆచార్య‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. త్రివిక్రమ్- మహేష్ కాంబినేషన్ లో వచ్చే మరో సినిమా కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ విజయ్ తో చేసిన ‘బీస్ట్’ విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో పాటు రణ్వీర్ సింగ్ తో ‘సర్కస్’ అనే సినిమాలో నటిస్తోంది పూజా హెగ్డే.

Fake Covid Certificate: వాటి కోసం ఇంత ఘోరమా..ఓ సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి ఘనకార్యం చూడండి..!

Fake Covid Certificate: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో కోవిడ్ లాంటి వ్యాధి ఇంతవరకు ఎవరూ చూసి ఉండరు.. విని ఉండరు కూడా. ఈ వ్యాధికి ఎండింగ్ అనేది లేకుండా.. వేవ్ ల మీద వేవ్ లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురి చేస్తుంది. అయితే ఈ వ్యాధి పాండిమిక్ తరహాలో విపరీతంగా వ్యాపిస్తోంది.

Fake Covid Certificate: వాటి కోసం ఇంత ఘోరమా..ఓ సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి ఘనకార్యం చూడండి..!

అది కాక ఈ వ్యాధి అంటువ్యాధి కావడంతో.. ఎవరైనా ఉద్యోగం చేస్తుంటే.. మిగతా వారికి ఆ వ్యాధి సోకుకుండా వారికి పెయిడ్ సెలవులను కల్పిస్తున్నారు కొన్ని కంపెనీలు. అయితే ఇలా కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో చేసే ఉద్యోగులు ఇదే ఆసరగా తీసుకుంటూ.. తప్పుడు దారిలో వెళ్తున్నారు.

Fake Covid Certificate: వాటి కోసం ఇంత ఘోరమా..ఓ సాఫ్ట్ వేర్ మహిళా ఉద్యోగి ఘనకార్యం చూడండి..!

కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకు సెలవులతో పాటు.. ఆ వ్యాధి నెగిటివ్ వచ్చే వరకు సెలవులు ప్రకటించే కంపెనీలు ఉన్నాయి. దీంతో కొంత మంది కరోనా పాజిటివ్ లేకున్నా.. సెలవుల కోసం కరోనా పాజిటివ్ వచ్చిందంటూ.. కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల నుంచి కోవిడ్ సర్టిఫికెట్లను తీసుకొని వచ్చి.. సెలవులను తీసుకుంటున్నారు.


నకిలీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి..

ఇటీవల ఇలా కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఓ మహిళా ఉద్యోగి నకిలీ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఆ ఉద్యోగి పట్టుపడింది. ఇలా హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న మహిళ తనకు కొవిడ్‌ పాజిటివ్‌ అంటూ ఓ ప్రైవేట్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నుంచి తెచ్చిన సర్టిఫికెట్‌ సమర్పించి సెలవులు తీసుకుంది.
దీనిపై ఆ కంపెనీ హెచ్ఆర్ టీం సభ్యులు విచారణ చేపట్టారు. దీంతో అది నకిలీది అని తేలడంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆ ఉద్యోగిపై యాజమాన్య చర్యలు తీసుకుంది. దీంతో అప్రమత్తమైన సదరు హెచ్ఆర్ డిపార్ట్ మెంట్ ఇలా ఎంతమంది నకిలీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి.. మోసం చేశారో అనే కోణం విచారణ చేపడుతున్నారు. ఇటువంటివి చాలా కంపెనీల్లో జరిగినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

దుబాయ్ లో అల్లు అర్జున్.. అందుకే వెళ్లాడా..?

అప్పటి వరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్.. పాన్ ఇండియా మూవీ పుష్ఫతో ‘ఐకాన్ స్టార్’ గా మారిపోయాడు. అల్లు అర్జున్ ఇక నుంచి ఐకాన్ స్టార్ అంటూ దర్శకుడు సుకుమార్ ఓ ఫంక్షన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పుష్ఫ సినిమా విడుదల కోసం ప్రతీ ఒక్కరూ ఎంతగానో ఎదురు చేస్తున్నారు.

మొదట ఒకే పార్ట్ గా విడుదల చేద్దామనకుకున్నా రెండు పార్ట్ లు తీయాల్సి వచ్చిందని దర్శకుడు సుకుమార్ అన్నారు. ఈ ఏడాది చివరకు మొదటి పార్ట్ ‘పుష్ప: ది రైజ్‌’ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అందుకే షూటింగ్‌ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీ ఉన్న అర్జున్ వ్యక్తిగత జీవితానికి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తున్నాడు.

తన కుటుంబంతో కలిసి ఈ మధ్య దుబాయ్ కు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అధికారికంగా మాత్రం తెలియదు కానీ.. అతడు అక్కడే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎంతో యాక్టివ్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే పాన్ ఇండియా లెవల్లో తీస్తున్న ఈ పుష్ప సినిమాపై ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు కూడా భారీగా అంచనా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప సినిమా హ్యట్రిక్ ది. ముందు ఆర్య, తర్వాత ఆర్యా2 తర్వాత మళ్లీ ఇలా ఈ సినిమా ద్వారా కలిశారు. అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి అయినా తనకు యూత్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టిన సినిమా ‘ఆర్య’ అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు.