Tag Archives: warning

ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతల బయపెట్టిందో అందరికీ తెలుసు. గత ఏడాదిలో విజృంభించిన కరోనా నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌.. ఇప్పుడు ప్రపంచ ఆదేశాలన్నింటికి పాకుతోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి.

కోవిడ్-19 యొక్క వేరియంట్ లలో అత్యంత వేగంగా విస్తరిస్తోన్న వేరియంట్ ఇదే అని “డబ్లూహెచ్‌ఓ” డైరెక్టర్ జనరల్ టెడ్రొస్ అథ్నోమ్ ఘ్యాబ్రియోసిస్ చెప్పారు. ఈ మేరకు డబ్లూహెచ్ఓ సభ్య దేశాలన్నింటిని అలర్ట్ చేసింది. ఇది ప్రపంచం అంతటా విస్తరించేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది.

కోవిడ్-19 లేదు.. కరోనా తగ్గిపోయింది అని ఎవరికి వాళ్ళు హీరోల లాగా నార్మల్ గా జీవనం సాగిస్తున్నారు, కానీ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోన్న ప్రకారం, ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికీ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది, ఇక నుండి అందరూ కరోనా వాక్సిన్ ల మీద మాత్రమే ఆధారపడకుండా సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ లు వాడటం, మాస్కులు ధరించడం తప్పక చేయాలని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ 77 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇది మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం చాలానే ఉందని హెచ్చరిస్తున్నారు. భారత్ లో కూడా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సిన్ల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఇతర ముందు జాగ్రత చర్యలపై కూడా ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని కోరింది. ఒమిక్రాన్ ని తేలికగా తీసుకొని జాగ్రతలు పాటించకపోతే ప్రపంచ దేశాలు భారీమూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే కొన్ని దేశాలు 2 డోసుల వ్యాక్సిన్ తో పాటుగా ఒమిక్రాన్ ని ఎదుర్కొనటానికి బూస్టర్ డోసులని వేయడానికి సన్నద్దం చేశారు.

రాజ్ తరుణ్ కు వార్నింగ్ ఇచ్చిన అరియానా.. చంపేస్తా అంటూ..

అనుభవించు రాజా.. ఈ చిత్ర బృందం సభ్యులు ప్రస్తుతం చిత్ర ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. అటు బిగ్ బాస్ లో కూడా సండే రోజూ ఫన్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని కామెడీ షోల్లో, మరికొన్ని స్పెషల్ ఈవెంట్లలో కూడా మెరుస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ ట్రైలర్లో మొదట ‘రూపాయి పాపాయి లాంటిది రా.. దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలి కానీ.. ఎవ‌డి చేతిలో ప‌డితే వాడి చేతిలో పెట్ట‌కూడ‌దు.’ అంటూ వ‌చ్చే డైలాగుతో మొద‌లవుతుంది. ఇక సినిమాలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డ్ గా కనిపించి.. తర్వాత పల్లెటూరు బ్యాగ్ గ్రౌండ్ లో కోడి పందాలతో సరదా లైఫ్ ను ఎంజాయ్ చేసే వ్యక్తిగా కనిపిస్తాడు. ‘వ‌చ్చే సంవ‌త్స‌రం ఇదే రోజు.. ఇక్క‌డే జెండా ఎగ‌రేస్తా.. ప్రెసిడెంట్‌గా ’ అంటూ చివ‌ర‌లో రాజ్‌త‌రుణ్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ అరియానా రాజ్ తరుణ్ తో పాటు.. చిత్ర బృందం తో ఇంటర్వ్యూ తీసుకుంది. దీనిలో హీరోయిన్ ఇంగ్లీష్ లో పలు వ్యాఖ్యలు చేస్తుంది. దీనిని తెలుగులో చెబితే బాగుంటుంది అంటూ.. అరియానా చెబుతుంది. దానిని మీరే చెప్పేయవచ్చు కదా అంటూ ఆ టీంలో ఒకరు అడగ్గా.. తాను చిన్న పిల్లను.. నాకేం తెలియదు అంటూ సమాధానం ఇస్తుంది.

దీనికి కౌంటర్ గా రాజ్ తరుణ్ అవును వ‌ర్క‌వుట్స్ మాత్ర‌మే తెలుసని అనే స‌రికి అరియానా దెబ్బ‌కు సైలెంట్ అయింది. ‘రాజ్ చంపుతా నిన్ను అంటూ.. అరుస్తూ కామెడీని’ పంచుతారు. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలో ఈ క్లిప్ వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మతో ఆమె ఓ ఇంటర్వ్యూలో వర్కవుట్స్ చేస్తూ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయింది. దానినే ప్రస్తావిస్తూ రాజ్ తరుణ్ కామెడీగా అన్నారు.

వాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన హైపర్ ఆది.. వీడియో వైరల్..!

హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే ఈ మధ్య హైపర్ ఆధి వార్తల్లో బాగా వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడిపై ఇష్టం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ హీరో అభిమానులు అతడిపై కోపంగా ఉన్నారని.. దీంతో అతడు మూడు రోజుల నుంచి కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఇన్ స్టాగ్రామ్ లో వీటిపై ఓ వీడియోను షేర్ చేశారు. అవన్నీ పేక్ వార్తలు అని.. తాను ఎక్కడకు వెళ్లలేదని.. జబర్దస్త్ స్కిట్లు చేస్తున్నానని.. తన పక్కన రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ఉన్నారని మాట్లాడారు.

ఇలా ఫేక్ వార్తలు రాసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి రా ఇస్తాను.. కానీ ఇలా ఫేక్ వార్తలు రాయకండి. ఇలా చేయడం ఎవరికీ మంచిది కాదు అంటు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వినకపోతే శాంతి స్వరూప్ ను మీపై వదులుతా అంటూ కామెడీగా చెప్పాడు. ఇలా అతడిపై విభిన్న వార్తలు రావడానికి కారణం ఏంటంటే.. దీపావళి కారణంగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అయిన ఓ షోలో అతడు మా అధ్యక్షుడు మంచు విష్ణును ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు.

దీంతో అతడి అభిమానులు కోపంతో ఉన్నారని.. అందుకే ఆది భయపడి దాక్కున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆది వీటిపై ఈ వీడియోతో పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. ఆది పంచ్ లు ఒకానొక సమయంలో కాట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. అంతకముందు కూడా అతడు క్షమాణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

షణ్ముఖ్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. డోస్ సరిపోలేదా అంటూ ట్రోలింగ్..!

బిగ్ బాస్ కార్యక్రమం 5 వారాలు పూర్తి చేసుకుని హౌస్ నుంచి ఐదు మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక గత వారంలో భాగంగా నామినేషన్ లో ఉన్న వారిలో హమీదా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే శనివారం ఆదివారం నాగార్జున హౌస్ సభ్యులతో మాట్లాడుతూ వారు చేసిన తప్పులను ప్రశ్నించడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం హౌస్ సభ్యులతో మాట్లాడిన నాగార్జున హౌస్మేట్స్ వ్యవహరించిన తీరును ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా శనివారం హౌస్ సభ్యులతో నాగార్జున హౌస్ లో రూలర్ ఎవరు, బానిస ఎవరు అనే విషయాన్ని కిరీటం పెడుతూ చెప్పాలని తెలియజేశారు. ఈ క్రమంలోనే చాలామంది శ్రీరామ్ ను రూలర్ అంటూ కిరీట పెట్టగా, హమీదకు బానిస అంటూ కిరీటం పెట్టారు. ఇకపోతే షణ్ముఖ్ వారికి కిరీటం పెట్టకుండా తనకు తానే కిరీటం పెట్టుకొని నాకు నేనే రాజు నేనే మంత్రి అనే డైలాగులు చెప్పడంతో వెంటనే నాగార్జున అందుకే నిన్ను ఎనిమిదిమంది నామినేట్ చేసింది అంటూ అతని పై కౌంటర్ వేస్తాడు.

ఇక హమీద కిరీటం పెడుతూ అసలు హమీద హౌస్లో లేనట్టే ఉంది ఇంట్లో కేవలం 14 మంది ఉన్నట్టున్నారు అంటూ మాట్లాడగా.. అసలు హౌస్ లో నువ్వు గేమ్ ఆడుతున్నావా అంటూ షన్ను పై సెటైర్ వేస్తుంది. నేను ఏం గేమ్ ఆడుతున్నానో ఆడియన్స్ కి తెలుసు అంటూ షణ్ముఖ్ సెటైర్ వేసాడు. ఈ క్రమంలోనే నాగార్జున మాట్లాడుతూ షణ్ముఖ్ పచ్చిమిర్చి తిన్నప్పటి నుంచి మార్పు వచ్చింది. అలాగే ఎనిమిది మంది నామినేట్ చేశాక ఆటలో మరింత మార్పు వచ్చింది అంటూ నాగార్జున షన్ను పై సెటైర్లు వేశారు.

షణ్ముఖ విషయంలో నాగార్జున సపోర్ట్ చేస్తూనే శ్రీరామ్ గురించి, హౌస్ మేట్స్ గురించి షణ్ముఖ్ చేసిన కామెంట్స్ అన్నింటినీ నాగార్జున అలాగే వదిలేశారు. ఇలా షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్ లు వేసినప్పటికీ అతను మాత్రం మార్పు లేకుండా ఆడటంతో నెటిజన్లు నాగార్జున ఇచ్చిన సరిపోలేదా అంటూ షణ్ముఖ్ పై కామెంట్లు చేస్తున్నారు.

నా భార్యను ఆంటీ అంటే అసలు బాగొదంటూ లాస్య భర్త స్ట్రాంగ్ వార్నింగ్!

ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 4 మొన్నటి వరకు ఎంతో రచ్చరచ్చగా కొనసాగింది. ఎప్పుడు గొడవలు, కొట్లాటలతో కొనసాగుతున్న బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి.గత 11 వారాల నుంచి ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారో, ఎవరు ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారో కూడా తెలియకుండా ఎప్పుడూ గొడవలు గా ఉండే ఇంటిలో ఒక్కసారిగా బిగ్ బాస్, హౌస్ వాతావరణాన్ని మార్చేశారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో పాటిస్పేట్ చేస్తున్న కంటెస్టెంట్ బంధువులు ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లడంతో ఎమోషనల్ వాతావరణం ఏర్పడింది. ప్రతి సారి లాగే ఈ సీజన్లో కూడా హౌస్ మేట్ సభ్యులను ఇంట్లోకి పంపించడంతో తమ వారిని చూసుకుని ఒకసారి గా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తొలిరోజు అఖిల్, అవినాష్,అభి,హారిక ఇక తమ వాళ్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

రెండవ రోజు హౌస్ లోకి సోహెల్,అరియాన, లాస్య కుటుంబ సభ్యులు హౌస్ లోకి ఎంటరయ్యారు. అయితే ముందుగా లాస్య కొడుకు జున్ను హౌస్ లోకి ఎంటర్ అవ్వగానే లాస్య తన కొడుకుని చూసి పరుగులు పెట్టి తన కొడుకును హత్తుకుని ఏడ్చేసింది. తరువాత ఆమె భర్త మంజునాథ్ కూడా అక్కడికి వచ్చాడు. మంజునాథ్ హౌస్ లోకి రాగానే కుటుంబ సభ్యులతో పరిచయం చేసుకొని ఎంతో ప్రేమగా అందరినీ పలకరించాడు.వీరు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు లాస్యని ఎప్పుడు ఆంటీ అని ఆట పట్టిస్తుంటారు. ఒకసారి నాగార్జున కూడా ఏంటీ ఏంటి లాస్యని ఆంటీ అని పిలుస్తున్నారు అనేసారు.

ఇంటి సభ్యులు లాస్యను ఎప్పుడు ఆంటీ అని ఆటపట్టిస్తూ వెక్కిరించేవారు. అలా అనొద్దు అని లాస్య ఎన్నిసార్లు చెప్పినా వారు అలాగే ఆటపట్టిస్తూ ఉండేవారు. ప్రస్తుతం లాస్య భర్త మంజునాథ్ హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా లాస్యని ఆంటీ అని అఖిల్, సోహెల్ సరదాగా ఆట పట్టించారు. దాంతో మంజునాథ్ వారికి వేలు చూపించి నా భార్యను ఆంటీ అని పిలవద్దు అలా అన్నారో మీరు అంతే అని అని వారికి సరదాగా హెచ్చరించారు. తరువాత మంజునాథ్ కుటుంబసభ్యులకు కొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో లో అందరూ ఎంతో సరదాగా గడుపుతున్నారు.

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..?

మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా గంట సమయం కూడా గడపలేనంతలా ఫోన్ కు అడిక్ట్ అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించే వినియోగదారులకు కొత్త రాన్సమ్‌వేర్‌ వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రచారం పొంచి ఉందని తెలుస్తోంది.

 

మాల్‌లాకర్.బి అని పిలిచే ఈ రాన్సమ్ వేర్ వల్ల మొబైల్ స్క్రీన్ యాక్సిస్ నిలిచిపోతుందని సమాచారం. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్స్‌ ద్వారా ఈ రాన్సమ్ వేర్ మన మొబైల్ లోకి చేరే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు సైతం రాన్సర్ వేర్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. కొంతమంది వెబ్ సైట్స్ నుంచి మొబైల్ ఫోన్లలో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు.

అలా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వాళ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. వైరస్ వెబ్ సైట్ యాప్స్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇతర ఫోన్లను కూడా చేరుతుందని సమాచారం. ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. సాధారణంగా రాన్సమ్ వేర్ ల వల్ల మొబైల్ ఫోన్ ఎన్ క్రిప్ట్ అవుతుంది. మాల్‌లాకర్.బి మాల్‌వేర్ మిగతా రాన్సర్ వేర్ లతో పోలిస్తే భిన్నంగా ఉంది.

ఫోన్ డిస్ ప్లే నిలిచిపోయే విధంగా చేసే ఈ రాన్సమ్ వేర్ బారిన పడ్డ వాళ్లకు ఫోన్ లో ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఎవరైతే చెప్పిన మొత్తం చెల్లిస్తారో వారి ఫోన్లు మాత్రమే అన్ లాక్ అవుతాయి. అయితే రాన్సమ్ వేర్ వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రాన్సమ్ వేర్ మొబైల్ ఫోన్లను అటాక్ చేసే పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.