మన నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ లేకుండా గంట సమయం కూడా గడపలేనంతలా ఫోన్ కు అడిక్ట్ అయ్యే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించే వినియోగదారులకు కొత్త రాన్సమ్వేర్ వల్ల ప్రమాదం పొంచి ఉందని ప్రచారం పొంచి ఉందని తెలుస్తోంది.
మాల్లాకర్.బి అని పిలిచే ఈ రాన్సమ్ వేర్ వల్ల మొబైల్ స్క్రీన్ యాక్సిస్ నిలిచిపోతుందని సమాచారం. ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా ఈ రాన్సమ్ వేర్ మన మొబైల్ లోకి చేరే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లు, ఆన్లైన్ ఫోరమ్లు సైతం రాన్సర్ వేర్ బారిన పడటానికి కారణమవుతున్నాయి. కొంతమంది వెబ్ సైట్స్ నుంచి మొబైల్ ఫోన్లలో యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటూ ఉంటారు.
అలా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వాళ్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. వైరస్ వెబ్ సైట్ యాప్స్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇతర ఫోన్లను కూడా చేరుతుందని సమాచారం. ప్లే స్టోర్స్ నుంచి మాత్రమే యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకుంటే ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. సాధారణంగా రాన్సమ్ వేర్ ల వల్ల మొబైల్ ఫోన్ ఎన్ క్రిప్ట్ అవుతుంది. మాల్లాకర్.బి మాల్వేర్ మిగతా రాన్సర్ వేర్ లతో పోలిస్తే భిన్నంగా ఉంది.
ఫోన్ డిస్ ప్లే నిలిచిపోయే విధంగా చేసే ఈ రాన్సమ్ వేర్ బారిన పడ్డ వాళ్లకు ఫోన్ లో ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఎవరైతే చెప్పిన మొత్తం చెల్లిస్తారో వారి ఫోన్లు మాత్రమే అన్ లాక్ అవుతాయి. అయితే రాన్సమ్ వేర్ వల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. రాన్సమ్ వేర్ మొబైల్ ఫోన్లను అటాక్ చేసే పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…