కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ప్రజలు ఉన్న కొద్దిపాటి నగదును అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు నగదు ఖర్చు పెట్టడం లేదు. కరోనా మహమ్మారి విజృంభణ మరికొన్ని నెలలు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం కోసమే నెల జీతంలో ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటోమొబైల్ పరిశ్రమ పండగను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి బొలెరో పికప్ వెహికల్ ను కొంటే లక్ష రూపాయల మేర వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తారో వారికి కంపెనీ లక్ష రూపాయల కరోనా వైరస్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తోంది. వాహనం కొన్న వ్యక్తితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు ఈ మేర ప్రయోజనాలు కలగనున్నాయి.
ఈ నెల 1 నుంచి వచ్చే నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 60 రోజుల కాలంలో బొలెరో పికప్ వాహనం కొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. సిటీ పికప్, చాంపర్, పికప్ మ్యాక్సి ట్రక్ లాంటి వాహనాలు కొనుగోలు చేసే వాళ్లకు సైతం మహీంద్రా అండ్ మహీంద్రా శుభవార్త చెప్పింది. వీళ్లకు ఫ్రీ కరోనా పాలసీ వర్తిస్తుంది. ఫ్రీ కరోనా పాలసీల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది.
వాహనం కొనుగోలు చేసిన రోజు నుంచి దాదాపు 10 నెలలు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో జత కట్టి ఈ ఆఫర్లను అందిస్తోంది. వాహనం కొనుగోలు చేసిన వాళ్లు ఆస్పత్రిలో చేరినా హోం క్వారంటైన్ లో ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు సైతం వాహనదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…