కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ప్రజలు ఉన్న కొద్దిపాటి నగదును అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు నగదు ఖర్చు పెట్టడం లేదు. కరోనా మహమ్మారి విజృంభణ మరికొన్ని నెలలు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం కోసమే నెల జీతంలో ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటోమొబైల్ పరిశ్రమ పండగను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి బొలెరో పికప్ వెహికల్ ను కొంటే లక్ష రూపాయల మేర వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తారో వారికి కంపెనీ లక్ష రూపాయల కరోనా వైరస్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తోంది. వాహనం కొన్న వ్యక్తితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు ఈ మేర ప్రయోజనాలు కలగనున్నాయి.
ఈ నెల 1 నుంచి వచ్చే నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 60 రోజుల కాలంలో బొలెరో పికప్ వాహనం కొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. సిటీ పికప్, చాంపర్, పికప్ మ్యాక్సి ట్రక్ లాంటి వాహనాలు కొనుగోలు చేసే వాళ్లకు సైతం మహీంద్రా అండ్ మహీంద్రా శుభవార్త చెప్పింది. వీళ్లకు ఫ్రీ కరోనా పాలసీ వర్తిస్తుంది. ఫ్రీ కరోనా పాలసీల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది.
వాహనం కొనుగోలు చేసిన రోజు నుంచి దాదాపు 10 నెలలు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో జత కట్టి ఈ ఆఫర్లను అందిస్తోంది. వాహనం కొనుగోలు చేసిన వాళ్లు ఆస్పత్రిలో చేరినా హోం క్వారంటైన్ లో ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు సైతం వాహనదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…