కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ప్రజలు ఉన్న కొద్దిపాటి నగదును అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు నగదు ఖర్చు పెట్టడం లేదు. కరోనా మహమ్మారి విజృంభణ మరికొన్ని నెలలు కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం కోసమే నెల జీతంలో ఎక్కువ మొత్తం కేటాయిస్తున్నారు. అయితే కరోనా విపత్కర పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటోమొబైల్ పరిశ్రమ పండగను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులను ఆకర్షించాలని భావిస్తోంది.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి బొలెరో పికప్ వెహికల్ ను కొంటే లక్ష రూపాయల మేర వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఈ వాహనాన్ని కొనుగోలు చేస్తారో వారికి కంపెనీ లక్ష రూపాయల కరోనా వైరస్ ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తోంది. వాహనం కొన్న వ్యక్తితో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులకు ఈ మేర ప్రయోజనాలు కలగనున్నాయి.
ఈ నెల 1 నుంచి వచ్చే నెల 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 60 రోజుల కాలంలో బొలెరో పికప్ వాహనం కొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రయోజనాలు పొందవచ్చు. సిటీ పికప్, చాంపర్, పికప్ మ్యాక్సి ట్రక్ లాంటి వాహనాలు కొనుగోలు చేసే వాళ్లకు సైతం మహీంద్రా అండ్ మహీంద్రా శుభవార్త చెప్పింది. వీళ్లకు ఫ్రీ కరోనా పాలసీ వర్తిస్తుంది. ఫ్రీ కరోనా పాలసీల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా భావిస్తోంది.
వాహనం కొనుగోలు చేసిన రోజు నుంచి దాదాపు 10 నెలలు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో జత కట్టి ఈ ఆఫర్లను అందిస్తోంది. వాహనం కొనుగోలు చేసిన వాళ్లు ఆస్పత్రిలో చేరినా హోం క్వారంటైన్ లో ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు సైతం వాహనదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…