మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ల విషయంలో బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడేవాళ్లు, యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వ్యక్తమవుతూ ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లు సైతం ఛార్జింగ్ కష్టాలు అనుభవించే ఉంటారు. అయితే ఈ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ పని చేస్తుంది.
ఇర్విన్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త, పీహెచ్డీ విద్యార్థి ఒక వస్తువు కోసం ప్రయోగాలు చేస్తూ అనుకోకుండా ఈ బ్యాటరీని కనిపెట్టారు. నానో వైర్లతో తయారు చేసిన ఈ బ్యాటరీలో ఛార్జింగ్ దశాబ్దాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ బ్యాటరీలలో ఛార్జింగ్ కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటుంది.
గత కొన్నేళ్ల నుంచి శాస్త్రవేత్తలు లైఫ్ లాంగ్ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీల కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మ్యా లే థాయ్ అనే విద్యార్థి , యూనివర్సిటీ శాస్త్రవేత్తతో కలిసి 100 నానో మీటర్ల కంటే అతిచిన్న పరిమాణం కలిగిన వైర్లతో బ్యాటరీని తయారు చేశాడు. శనగ వెన్న మాదిరిగా ఉండే జెల్ ను ఈ బ్యాటరీలో వినియోగిస్తారు. ఇలాంటి బ్యాటరీలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి బ్యాటరీలు ప్రజల ఛార్జింగ్ కష్టాలను కూడా సులభంగా తీరుస్తాయి. నానోవైర్ బ్యాటరీలు చాలా సంవత్సరాల మన్నిక ఇస్తాయి. 2021 నుంచి ఈ బ్యాటరీలో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 నాటికి ఈ బ్యాటరీలు 243 మిలియన్ డాలర్ల మార్కెట్ ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…