Featured

ప్రజలకు శుభవార్త.. ఈ బ్యాటరీతో ఛార్జింగ్ కష్టాలు తీరినట్లే..!

మనలో చాలామంది స్మార్ట్ ఫోన్ల విషయంలో బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందని ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడేవాళ్లు, యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వ్యక్తమవుతూ ఉంటాయి. ఎక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లు సైతం ఛార్జింగ్ కష్టాలు అనుభవించే ఉంటారు. అయితే ఈ బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ పని చేస్తుంది.

ఇర్విన్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్త, పీహెచ్డీ విద్యార్థి ఒక వస్తువు కోసం ప్రయోగాలు చేస్తూ అనుకోకుండా ఈ బ్యాటరీని కనిపెట్టారు. నానో వైర్లతో తయారు చేసిన ఈ బ్యాటరీలో ఛార్జింగ్ దశాబ్దాల పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ ఫోన్లలో లిథియం అయాన్ బ్యాటరీలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ బ్యాటరీలలో ఛార్జింగ్ కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటుంది.

గత కొన్నేళ్ల నుంచి శాస్త్రవేత్తలు లైఫ్ లాంగ్ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేని బ్యాటరీల కోసం ప్రయోగాలు చేస్తున్నారు. మ్యా లే థాయ్ అనే విద్యార్థి , యూనివర్సిటీ శాస్త్రవేత్తతో కలిసి 100 నానో మీటర్ల కంటే అతిచిన్న పరిమాణం కలిగిన వైర్లతో బ్యాటరీని తయారు చేశాడు. శనగ వెన్న మాదిరిగా ఉండే జెల్ ను ఈ బ్యాటరీలో వినియోగిస్తారు. ఇలాంటి బ్యాటరీలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటి బ్యాటరీలు ప్రజల ఛార్జింగ్ కష్టాలను కూడా సులభంగా తీరుస్తాయి. నానోవైర్ బ్యాటరీలు చాలా సంవత్సరాల మన్నిక ఇస్తాయి. 2021 నుంచి ఈ బ్యాటరీలో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 నాటికి ఈ బ్యాటరీలు 243 మిలియన్ డాలర్ల మార్కెట్ ను సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago