Featured

ఆ ఇళ్లలో వందల సిమ్ కార్డులు… ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..?

మనలో చాలామందికి ప్రతిరోజూ ఏదో ఒక ఆఫర్ పేరిట ఫోన్లు వస్తుంటాయి. మరి కొంతమందికి ఆన్ లైన్ లో నచ్చిన వస్తువులు సెకండ్ హ్యాండ్ లో తక్కువ ధరకే దర్శనమిస్తూ ఉంటాయి. ఆలస్యం చేస్తే ఆఫర్ అందుబాటులో ఉండదని భావించి మనలో చాలామంది వెంటనే వాటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించి మోసపోతూ ఉంటారు.ఒకవేళ మోసపోయినాఫిర్యాదు చేయడానికి భయపడుతూ ఉంటారు.

తాజాగా లా వేల సంఖ్యలో ప్రజలను మోసం చేసిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓఎల్‌ఎక్స్‌ అమ్మకాల పేరుతో గత కొన్ని నెలల నుంచి భరత్‌పూర్‌ గ్యాంగ్‌ చేస్తున్న మోసాలు అన్నీఇన్నీ కావు. ఓఎల్‌ఎక్స్‌, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్ పేర్లతో మోసాలు చేసిన నిందితుల ఇళ్లలో 800 సిమ్ కార్డులు లభ్యమయ్యాయి. అంత పెద్ద మొత్తంలో సిమ్ కార్డులను చూసి సైబర్ క్రైం పోలీసులు అవాక్కయ్యారు.

మోసగాళ్లు తమ చేతిలో ఎవరైనా మోసపోతే వాళ్ల నుంచి ఇబ్బందులు రాకుండా వెంటనే సిమ్ కార్డును మార్చి మరొక కొత్త మోసానికి తెర లేపుతున్నారు. ప్రజలు దేశంలో రోజురోజుకు మోసాలు చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గుడ్డిగా నమ్మి మోసపోతే తర్వాత బాధ పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. యువత, విద్యార్థులు ఎక్కువగా ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నారు.

కొందరు మోసగాళ్ల వల్ల సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడేవారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ తరహా మోసాలు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

3 hours ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

3 hours ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

3 hours ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

3 hours ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

3 hours ago

తిరుమల మాడ వీధుల రహస్యాలు.. ఈ ప్రదక్షిణకు అంతటి పవిత్రత ఎందుకు?

తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…

3 hours ago