హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే ఈ మధ్య హైపర్ ఆధి వార్తల్లో బాగా వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడిపై ఇష్టం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ హీరో అభిమానులు అతడిపై కోపంగా ఉన్నారని.. దీంతో అతడు మూడు రోజుల నుంచి కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఇన్ స్టాగ్రామ్ లో వీటిపై ఓ వీడియోను షేర్ చేశారు. అవన్నీ పేక్ వార్తలు అని.. తాను ఎక్కడకు వెళ్లలేదని.. జబర్దస్త్ స్కిట్లు చేస్తున్నానని.. తన పక్కన రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ఉన్నారని మాట్లాడారు.
ఇలా ఫేక్ వార్తలు రాసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి రా ఇస్తాను.. కానీ ఇలా ఫేక్ వార్తలు రాయకండి. ఇలా చేయడం ఎవరికీ మంచిది కాదు అంటు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వినకపోతే శాంతి స్వరూప్ ను మీపై వదులుతా అంటూ కామెడీగా చెప్పాడు. ఇలా అతడిపై విభిన్న వార్తలు రావడానికి కారణం ఏంటంటే.. దీపావళి కారణంగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అయిన ఓ షోలో అతడు మా అధ్యక్షుడు మంచు విష్ణును ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు.
దీంతో అతడి అభిమానులు కోపంతో ఉన్నారని.. అందుకే ఆది భయపడి దాక్కున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆది వీటిపై ఈ వీడియోతో పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. ఆది పంచ్ లు ఒకానొక సమయంలో కాట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. అంతకముందు కూడా అతడు క్షమాణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…
ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…