హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే ఈ మధ్య హైపర్ ఆధి వార్తల్లో బాగా వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడిపై ఇష్టం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ హీరో అభిమానులు అతడిపై కోపంగా ఉన్నారని.. దీంతో అతడు మూడు రోజుల నుంచి కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఇన్ స్టాగ్రామ్ లో వీటిపై ఓ వీడియోను షేర్ చేశారు. అవన్నీ పేక్ వార్తలు అని.. తాను ఎక్కడకు వెళ్లలేదని.. జబర్దస్త్ స్కిట్లు చేస్తున్నానని.. తన పక్కన రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ఉన్నారని మాట్లాడారు.
ఇలా ఫేక్ వార్తలు రాసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి రా ఇస్తాను.. కానీ ఇలా ఫేక్ వార్తలు రాయకండి. ఇలా చేయడం ఎవరికీ మంచిది కాదు అంటు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వినకపోతే శాంతి స్వరూప్ ను మీపై వదులుతా అంటూ కామెడీగా చెప్పాడు. ఇలా అతడిపై విభిన్న వార్తలు రావడానికి కారణం ఏంటంటే.. దీపావళి కారణంగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అయిన ఓ షోలో అతడు మా అధ్యక్షుడు మంచు విష్ణును ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు.
దీంతో అతడి అభిమానులు కోపంతో ఉన్నారని.. అందుకే ఆది భయపడి దాక్కున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆది వీటిపై ఈ వీడియోతో పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. ఆది పంచ్ లు ఒకానొక సమయంలో కాట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. అంతకముందు కూడా అతడు క్షమాణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…