దూర ప్రాంతాలకు వెల్లే ప్రయాణికులకు.. బడ్జెట్ ధరలో ప్రయాణ సౌక్యాన్ని కల్పించే శాఖ రైల్వే. రైల్వే ప్రయాణం అంటే ఎంతో మంది ఇష్టపడతారు. దీని ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు అనే భావన కూడా ఉంటుంది. 99 శాతం ప్రమాదాలు అనేవి రైల్వే ప్రయాణంలో చోటు చేసుకోవు.. కానీ కొన్నిసందర్బాల్లో అనుకోని ఘటనల వల్ల ప్రమాదలు సంభవిస్తాయి.
తాజాగా జరిగిన ఘటనలో ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభంవించింది. రైలులోని ఏసీ బోగీలో ఈ మంటలు వ్యాపించాయి. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజ్ ఎక్స్ప్రెస్ అనే రైలు న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వరకు వెళ్తుంది. డిల్లీ నుంచి యూపీలోని ఝాన్సీ వెళుతున్నఈ రైలు లో శనివారం ఉదయం ఏసీ బోగీ నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించారు.
దీంతో ప్రయాణికులు హడలిపోయారు. భయాందోళనలకు గురయ్యారు. ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు వ్యాపించటంతో రైలును హర్యానాలోని అసోతి స్టేషన్ వద్ద నిలిపివేశారు. బ్రేక్ జామ్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు ఓ రైల్వే అధికారి చెప్పారు. వెంటనే స్పందించి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ చెప్పారు. స్వల్ప స్థాయిలోనే మంటలు వచ్చాయని.. మంటల కంటే ఎక్కువగా పొగ కమ్ముకుందని సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతీ ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనేది అనుమానిస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…