దూర ప్రాంతాలకు వెల్లే ప్రయాణికులకు.. బడ్జెట్ ధరలో ప్రయాణ సౌక్యాన్ని కల్పించే శాఖ రైల్వే. రైల్వే ప్రయాణం అంటే ఎంతో మంది ఇష్టపడతారు. దీని ద్వారా ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు అనే భావన కూడా ఉంటుంది. 99 శాతం ప్రమాదాలు అనేవి రైల్వే ప్రయాణంలో చోటు చేసుకోవు.. కానీ కొన్నిసందర్బాల్లో అనుకోని ఘటనల వల్ల ప్రమాదలు సంభవిస్తాయి.
తాజాగా జరిగిన ఘటనలో ఓ రైలులో అగ్ని ప్రమాదం సంభంవించింది. రైలులోని ఏసీ బోగీలో ఈ మంటలు వ్యాపించాయి. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజ్ ఎక్స్ప్రెస్ అనే రైలు న్యూఢిల్లీ నుంచి ఝాన్సీ వరకు వెళ్తుంది. డిల్లీ నుంచి యూపీలోని ఝాన్సీ వెళుతున్నఈ రైలు లో శనివారం ఉదయం ఏసీ బోగీ నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించారు.
దీంతో ప్రయాణికులు హడలిపోయారు. భయాందోళనలకు గురయ్యారు. ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు వ్యాపించటంతో రైలును హర్యానాలోని అసోతి స్టేషన్ వద్ద నిలిపివేశారు. బ్రేక్ జామ్ కావడం వల్ల అగ్నిప్రమాదం సంభవించినట్లు ఓ రైల్వే అధికారి చెప్పారు. వెంటనే స్పందించి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదంటూ చెప్పారు. స్వల్ప స్థాయిలోనే మంటలు వచ్చాయని.. మంటల కంటే ఎక్కువగా పొగ కమ్ముకుందని సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రతీ ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చనేది అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిన పుణ్యక్షేత్రాల్లో విజయ కీళాద్రి ఆలయాలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. వివిధ జిల్లాల్లో విస్తరించి…
తెలుగు సినీ రంగంలో క్రమశిక్షణ, గంభీరమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచే మంచు మోహన్ బాబు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్…
తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ఇప్పటికే మంచి అంచనాలు…
వేసవి రాగానే ఇంట్లో ఉండటం చాలా మందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసించే వారికి గదులు భగ్గుమంటూ…
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…