ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ!

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల దురాక్రమణ కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని సరిహద్దులను తాలిబన్లు స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇవాళ ఆఫ్గాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించారు. అతి పెద్ద నగరమైన జలాలాబాద్ ను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటివరకు 19 ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు.. ఆఫ్ఘనిస్తాన్ హస్తగతమే లక్ష్యంగా దురాక్రమణను కొనసాగిస్తున్నారు.

taliban

తాలిబన్ల దురాక్రమణ పై ఐరాస జనరల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బలప్రయోగం అంతరించడానికి దారితీస్తుందని హెచ్చరించారు. మరోవైపు అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని హెలికాప్టర్ల ద్వారా తరలిస్తోంది.