General News

భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లలను చంపి భార్య ఆత్మహత్య!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమైన నేపథ్యంలో కరోనా వైరస్ ఎంతోమంది పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు.వైరస్ బారిన పడి కొందరు చనిపోతే వారి మరణాన్ని తట్టుకోలేక మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఒకటి చోటు చేసుకుంది.భర్త కరోనాతో మరణించాడని కుంగిపోయిన భార్య తన పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాంగాడుకు చెందిన భాస్కర్‌, నిత్య దంపతులు నివసించేవారు. వీరికి కుమార్తె మహతి, కుమారుడు యాదవ్ కృష్ణ అనే పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగిపోతున్న వీరి కుటుంబంలో కరోనా చిచ్చు పెట్టింది. గత నెల రెండవ తేదీన భాస్కర్ కరోనా బారిన పడగా అతడు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 9వ తేదీన మృతి చెందాడు.

తన భర్త భాస్కర్ మృతి చెందడంతో నిత్య శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఈరోడ్‌లో ఉన్నటువంటి తన పుట్టింటికి వెళ్ళింది.తన పుట్టింటికి వెళ్ళిన నిత్య తన భర్త ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది.తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని భావించిన నిత్య కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం భోజనంలో తన పిల్లలకు విషం కలిపి తినిపించి తాను కూడా గదిలోకి వెళ్లి ఆత్మ హత్యకు పాల్పడింది. ఆలస్యంగా గమనించిన తన తండ్రి పార్థసారధి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి ముగ్గురి శవాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

8 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

8 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

8 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

8 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

8 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

8 hours ago