Tammareddy Bharadwaj: తెలుగు వెండితెర రారాజుగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఆదివారం ఈయన మరణించడంతో తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే మంగళవారం ఈయన సంస్కరణ సభను నిర్వహించారు.
ఫిల్మినగర్ కల్చరల్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ సంస్కరణ సభలో పాల్గొన్నటువంటి తమ్మారెడ్డి భరద్వాజ్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక తాను నిర్మాతగా కృష్ణంరాజు హీరోగా ఫస్ట్ సినిమా చేశానని అయితే ఈ సినిమాకు మా అన్నయ్య దర్శకుడు అంటూ తమ్మారెడ్డి తెలియచేశారు.
ఈ సినిమాలో మా అన్నయ్య ఏకంగా నాలుగు పాటలు పెడతానన్నారు అయితే నాలుగు పాటలు పెడితే ఎవరు చూస్తారు అంటూ తాను అడ్డుపడ్డానని ఇదే విషయాన్ని కృష్ణంరాజు దగ్గరికి వెళ్లి మా అన్నయ్య నాలుగు పాటలు పెడతానన్నారు అసలు ఎవరు చూస్తారు ఈ పాటలు అని అతనితో చెప్పాను. ఆ స్థానంలో కృష్ణంరాజు కాకుండా వేరే ఏ హీరో ఉన్న లాగిపెట్టి నన్ను కొట్టేవారు. ఆయన మాత్రం ఓ చిన్న నవ్వు నవ్వి నేను పనికిరానా? అంటూ మా అన్నయ్యని ఒప్పించారు. ఆయన సినిమాకు ఏం కావాలో అంతే చేస్తారని తమ్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ సంఘటన తర్వాత దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు ఆయన ఫోన్ ఎత్తాలన్న భయం వేసేదని తమ్మారెడ్డి పేర్కొన్నారు.ఇకపోతే మూడు సంవత్సరాల క్రితం కృష్ణంరాజు గారు తన వద్దకు వచ్చి మూవీ టవర్స్ లో తనకు ఒక ఫ్లాట్ కావాలని అడిగారు.అయితే తనకు మార్కెట్ రేట్ కావాలని చెప్పగా మార్కెట్ రేట్ ఎంత ఉంటే అంత ఇస్తానని కృష్ణంరాజు గారు చెప్పారు. అయితే ఆయనకు చెప్పినట్టుగా నేను ఆ ఫ్లాట్ ఇవ్వలేకపోయానని ఈ విషయం గురించి మాట్లాడాలన్నా చాలా సిగ్గుగా ఉందంటూ ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…