NTR: కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేసిన తారక్… ట్వీట్ వైరల్!
NTR: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు లక్షల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. చాపకింద నీరులా పాకిపోతున్న ఈ మహమ్మారి బారిన ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది కోలుకున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కరోనా బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కరోనా బారిన పడిన విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు అనే విషయం తెలియగానే ఎంతోమంది అభిమానులు చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా తెలియ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తొందరగా కోలుకోవాలి మామయ్య అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా లోకేష్ కూడా త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.గతంలో ఎన్టీఆర్ కరోనా బారిన పడినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక నేడు చంద్రబాబు కరోనా బారిన పడటంతో ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…