Taraka ratna : ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన ఎన్టీఆర్ కుమారుడు మోహన కృష్ణ తనయుడు తారక రత్న ఒకేసారి తొమ్మిది సినిమాలను ఒప్పుకుని అప్పట్లో రికార్డు సృష్టించాడు. అయితే మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ పర్వాలేదానిపించినా మిగిలిన సినిమాలు ఎపుడు వచ్చాయో ఎపుడు పోయాయో కూడా తెలియకుండా వెళ్లిపోయాయి. ఇక సినిమాలను తగ్గించిన తారక రత్న మధ్యలో ఒకసారి రవిబాబు సినిమా ‘అమరావతి’ లో విలన్ పాత్రలో ఆదరగొట్టాడు. ఇక మళ్ళీ చాలా రోజులకు వెబ్ సిరీస్ తో అలరించిన తారక రత్న ఈసారి సినిమాతో కాదు పొలిటికల్ స్పీచ్ తో వైరల్ అవుతున్నాడు. తన తాతయ్య ఎన్టీఆర్ గురించి గొప్పగా మాట్లాడి అభిమానులను ఆకర్శించారు.
ఎన్టీఆర్ దేవుడు… సమాజానికి ఎంతో చేసారు…
తారక రత్న ప్రస్తుతం తెల్ల గడ్డం పెట్టుకుని టోటల్ లుక్ మార్చేశాడు. ఇక ఇటీవల గుంటూరులో తన తాతయ్య ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గురించి స్పీచ్ అదరగొట్టాడు. దేవుడైనా ఎన్టీఆరే, రాక్షసుడైనా ఎన్టీఆరే అంటూ గూస్ బంప్స్ ఇచ్చే స్పీచ్ ఇచ్చాడు. కేవలం సినిమాలతో ఎన్టీఆర్ గొప్పవాడు కాలేదంటూ రాముడైనా ఆయనే రావణాసురుడైనా ఆయనే, కృష్ణుడైనా ఆయనే, కీచకుడైనా ఆయనే అంటూ తారక రత్న వర్ణించాడు. ఆయన సినిమాలతోనే గొప్పవాడు కాలేదు. కేవలం పది సినిమాలు సంవత్సరానికి ఆడే సమయంలో నూరు సినిమాలు ఆడే రేంజ్ కి తెలుగు సినిమాను తీసుకోచ్చారు.
తెలుగు సినిమా కు గుర్తింపు తెచ్చారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కి కొత్త గుర్తింపు ఇచ్చారు. తనకు రాష్ట్ర నాయకులు సరి తూగరని కేంద్రంలో ప్రభుత్వంతోనే పోరాడారు. రాష్ట్రానికి కావల్సినవి తెచ్చుకున్నారు. ఆయన తెచ్చిన ఎన్నో పథకాల్లో ఆడబిడ్డ కు ఆస్థిలో సమాన హక్కు, పేదలకు బియ్యం, మధ్యపాన నిషేధం వంటి ఎన్నో పథకాలు దేశానికి ఆదర్శమాయ్యాయి అంటూ చెప్పరు. సమాజానికి ఆయన ఇంత చేసారు కాబట్టే ఆయన అందరి స్టార్స్ లాగా పుస్తకానికి అట్ట లాగానో లేక ఇంటి గోడలకు ఒక పోస్టర్ గా మిగలలేదు. ప్రతి తెలుగు వాడి ఇంటి పూజ మందిరంలో దేవుడయ్యడు అంటూ తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…