టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ పెద్ద వివాదానికి కారణమైంది. వార్-2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్, తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య సంభాషణ జరిగిందని చెబుతున్న ఒక ఆడియోలో, “నేను అనంతపురం ఎమ్మెల్యే.. సినిమా ఆడదు” అని ప్రసాద్ వ్యాఖ్యానించినట్లుగా ఉంది. ఈ ఆడియో నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
ఈ ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అది తనది కాదని గట్టిగా ఖండించారు. ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమని, గత 16 నెలలుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “నేను ఎప్పటినుంచో నందమూరి కుటుంబ అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు తప్పుడు ఆడియో సృష్టించి నేను జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందులో అసలే నిజం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఆడియో కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే, తన ప్రమేయం లేకపోయినప్పటికీ క్షమాపణ చెబుతున్నానని ప్రసాద్ తెలిపారు. తాను నారా, నందమూరి కుటుంబాలకు ఎప్పటికీ విధేయుడినేనని వెల్లడించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయటపెడతారని ఆయన చెప్పారు. ఈ ఆడియో నిజమా లేదా నకిలీదా అనేది పోలీసుల దర్యాప్తుతోనే తేలాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…