టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్ పెద్ద వివాదానికి కారణమైంది. వార్-2 సినిమా విడుదల సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్, తెలుగు యువత నేత గుత్త ధనుంజయ నాయుడు మధ్య సంభాషణ జరిగిందని చెబుతున్న ఒక ఆడియోలో, “నేను అనంతపురం ఎమ్మెల్యే.. సినిమా ఆడదు” అని ప్రసాద్ వ్యాఖ్యానించినట్లుగా ఉంది. ఈ ఆడియో నెట్టింట వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
ఈ ఆడియోపై స్పందించిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అది తనది కాదని గట్టిగా ఖండించారు. ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రలో భాగమని, గత 16 నెలలుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. “నేను ఎప్పటినుంచో నందమూరి కుటుంబ అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు అంటే నాకు ఇష్టం. కానీ ఇప్పుడు తప్పుడు ఆడియో సృష్టించి నేను జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందులో అసలే నిజం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఆడియో కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే, తన ప్రమేయం లేకపోయినప్పటికీ క్షమాపణ చెబుతున్నానని ప్రసాద్ తెలిపారు. తాను నారా, నందమూరి కుటుంబాలకు ఎప్పటికీ విధేయుడినేనని వెల్లడించారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని, పోలీసులు దర్యాప్తు చేసి నిజాలు బయటపెడతారని ఆయన చెప్పారు. ఈ ఆడియో నిజమా లేదా నకిలీదా అనేది పోలీసుల దర్యాప్తుతోనే తేలాల్సి ఉంది.
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన…