ఎన్ని డ్రింక్స్ ఉన్నా.. టీకి ఉండే ప్రత్యేకతే వేరు.. ఉదయాన్ని ఓ కప్పు టీ కడుపులో పడనిదే ఏ పని మొదలు పెట్టని వారు చాలా మంది ఉంటారు. ఉదయం నుంచి మొదలుపెడితే.. సాయంత్రం దాకా పదుల సంఖ్యలో టీలను తాగే టీ వ్యసనపరుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. టీ లేనిదే ఏ ఆతిధ్యం కూడా మొదలుకాదందే అతిశయోక్తి కాదు..
ఇలాంటి టీకి కారణమైన టీ పొడికి ఎంత ధర ఉంటుంది. ఒక కిలోకు వందల్లో ఉంటుంది.. మరి ఎక్కువ డిమాండ్ ఉన్న టీ పొడి అయితే మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది.. కానీ ఒక కిలో టీ పొడి పౌడర్ లక్ష రూపాయలు ఉందంటే ఎవరైనా నమ్ముతారా… నమ్మకపోతే టీ పొడి గురించి తెలుసుకోవాల్సింది.
టీ పౌడర్లలో అస్సాంలో పండే టీ పౌడర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే తేయాకు మంచి సువాసన, టేస్ట్ ఇస్తుందని చాలా మంది చెబుతుంటారు. కాగా ఇటీవల నాణ్యమైన తేయాకును అక్కడి యజమానులు వేలానికి పెట్టారు. దీంట్లో కిలో టీ పౌడర్ ఏకంగా లక్ష రూపాయలు పలికింది. సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ ’మనోహరి గోల్డ్ టీ పొడి‘ని రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేశారు.
ఏకంగా రూ.99,999ను వేలంలో పాడి ఈ తేయాకును దక్కించుకున్నారు. గతంలో కూడా ఒక కిలో ఈ టీపౌడర్ రూ. 75 వేలకు అమ్ముడైంది. టీ కాచేటప్పుడు గోల్డ్ రంగు రావడం మనోహరి గోల్డ్ టీ పొడి ప్రత్యేకత. అంతే కాకుండా ఈ టీ వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉండటం కూడా టీ పొడికి ఈ రేటు పలుకుతోంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…