Pallavi Prashanth: ఓట్లు వేయండి అంటూ ప్రతి ఒక్క ఇంటికి రైస్ ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్న ప్రశాంత్ టీం… మామూలు ప్లాన్ కాదుగా?

Pallavi Prashanth: బిగ్ బాస్ కార్యక్రమంలోకి కామన్ మ్యాన్ క్యాటగిరి ద్వారా ఎంట్రీ ఇచ్చారు పల్లవి ప్రశాంత్ ఈయన ఒక రైతు బిడ్డ యూట్యూబ్ ద్వారా రైతు పడే కష్టాలు అన్నింటిని కూడా ఈయన వీడియోల రూపంలో అందరితో పంచుకునేవారు ఇలా సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంతి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు.

ఇలా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈయన అక్కడ మాత్రం తన ఆట తీరును కనబరుస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఫిజికల్ టాస్కులలో ఎంతో అద్భుతంగా ఆడేటటువంటి ఈయన కొన్ని సింపతి డ్రామాలు వేస్తూ కూడా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

మొదటి మూడువారాల పెద్దగా ఆట తీరు కనబడచకపోయినటువంటి ఈయన ఇప్పుడు మాత్రం టైటిల్ రేస్ కి చేరుకున్నారు. టైటిల్ ఈయనకే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన బిగ్ బాస్ లోకి వచ్చే ముందు పెద్ద ఎత్తున ఏజెన్సీలను ఏర్పాటు చేసి తనని ప్రమోట్ చేయాలని చెప్పుకోవచ్చారు.

విన్నర్ పల్లవి ప్రశాంత్…

ఇకపోతే పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న కూడా ఈయనకు ఓట్లు వేయాలి అంటూ తన గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి ఒక బియ్యపు ప్యాకెట్ అందజేస్తున్నారని తెలుస్తుంది.ఈయన విన్నరని కన్ఫర్మ్ అయిన ప్రతి ఒక్కరికి ఇలా రైస్ ప్యాకెట్ ఉచితంగా ఇవ్వడంతో పల్లవి ప్రశాంత్ భారీగానే ప్లాన్ చేశారు అంటూ కొందరు ఈయన చేస్తున్న పనిపై కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ ఓటింగ్ కూడా చివరికి పొలిటికల్ ఓటింగ్ లా మారిపోయిందని ఓటు వేయాలి అంటూ బియ్యం ప్యాకెట్లు పంచడం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు.