Tejaswi Madivada : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సైడ్ క్యారెక్టర్ తో పాపులర్ అయిన తేజస్వి ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ సినిమా ‘ఐస్ క్రీమ్’ లో మెయిన్ లీడ్ చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. చాలా బోల్డ్ గా సినిమాలు చేస్తూ మాట్లాడే తేజస్వి బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనింది. చేసింది తక్కువ సినిమాలే అయినా అమ్మడి బోల్డ్ నెస్ తో బాగా ఫేమస్ అయింది. ప్రస్తుతం ‘కమిట్మెంట్’ అనే సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే సినిమా విడుదలకు ముందే హాట్ కామెంట్స్ చేసి సినిమాకు మంచి పబ్లిసిటీ ఇచ్చింది.
కౌశల్ ఆర్మీ వల్ల చాలా బాధ పడ్డాను…
కేరింత, ఐస్ క్రీమ్ వంటి సినిమాలతో బాగా క్రేజ్ తెచ్చుకున్న తేజస్వి, బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయింది. అయితే బిగ్ బాస్ లో కౌశల్ ఆర్మీ వల్ల బాగా నెగెటివిటీ ఎదుర్కొన్నానని తాజాగా కమిట్మెంట్ సినిమా ప్రమోషన్స్ లో ఓపెన్ అయింది. బిగ్ బాస్ లో నుండి బయటికి వచ్చినపుడు హ్యాపీగా బయటికి వచ్చాను కానీ సోషల్ మీడియాలో నాపై కౌశల్ ఆర్మీ బూతులు తిట్టడం, పిచ్చి పిచ్చి మీమ్స్ తో రెచ్చిపోయారు. ఇవన్నీ భరించలేక పోయాను. ఇండియాలో ఉండకుండా విదేశాల్లో ఒంటరిగా ఉన్నాను, సినిమాలను వదిలేసాను. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను.
జీవితంలో సినిమాల జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను, ఫుల్లుగా మద్యం తాగి, లావేక్కిపోయాను. అదే సమయంలో కమిట్మెంట్ సినిమా ఆఫర్ వచ్చింది. కథ నచ్చింది మళ్ళీ సినిమా చేయాలనిపించింది. అయితే సినిమాల వల్ల కంటే బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వల్ల చాలా బాధ పడ్డాను అంటూ చెప్పింది. అయినా ఇదంతా చేసి కౌశల్ ఏమి సాధించాడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడున్నాడు.. ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం వచ్చింది అతనికి అంటూ ఫైర్ అయింది. ఇక కమిట్మెంట్ సినిమాలో నేను లావుగా షేప్ అవుట్ అయి కనిపిస్తాను కారణం అప్పుడు ఫుల్లుగా మందు తాగుతూ ఉండేదాన్ని అందుకే అలా అంటూ ఓపెన్ గా అన్నీ చెప్పేసింది.
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న వేళ శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో నీటితో పాటు ఆరోగ్యానికి మేలు…
ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఫ్రిజ్ వినియోగం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లని నీరు, ఐస్ క్యూబ్స్ లేకుండా చాలామందికి రోజు…
విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ.…
భారతీయ సంస్కృతిలో రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడి జీవితం ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. త్రేతాయుగంలో జరిగిన ఈ మహాగాథతో…
కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో వెలసిన నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. పెన్నా నది…
నేటి వేగవంతమైన జీవితంలో వెట్ వైప్స్ చాలా మందికి రోజువారీ అవసరంగా మారిపోయాయి. బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాల్లో లేదా మేకప్…