Categories: FeaturedGeneral News

తెలంగాణాలో 23 రోజుల చిన్నారికి కరోనా పాజిటివ్ !! అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం..

కరోనా పలానా వయస్సు ఉన్న వారికి మాత్రమే వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్యులు చెబుతున్న మాటలు నిజమవుతున్నాయి. ఒక పక్క కరోనా కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో 23 రోజుల పసికందును కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితమే ఈ చిన్నారి తండ్రి మరియు నానమ్మకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ తెలిపారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆ చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీ మర్కజ్ కి వెళ్లివచ్చిన వారి నుంచి ఈ ముగ్గురికి వైరస్ అంటుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నిన్నటి వరకు జిల్లాలో 7 కరోనా పాజిటివ్ కేసులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. కాగా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా బాధితుల ఇంటి చుట్టూ పక్కల 3 కిలోమీటర్ల వరకు కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎవరు అవసరం అయితే తప్ప బయటకి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. భాదితుల ఇంటి వద్ద శానిటైజ్ చేస్తున్నారు. ఇంకా ఆప్రాంతంలో వీరి నుంచి ఇంకా ఎంతమందికి ఈ వ్యాధి సోకింది అనే విషయంపై నిఘా పెట్టారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago