Varahi: జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు. ఎన్నో రకాల సౌకర్యాలతో ఈ వాహనం తయారు చేశారు దీనిని తయారు చేయడం కోసం భారీ స్థాయిలోనే ఖర్చు కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ వాహనం కూడా తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ అయింది.
వారహి వాహనంలో ఆంధ్రప్రదేశ్లో పలు నియోజకవర్గాలలో రోడ్ షోలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మాత్రం ప్రచారానికి ఈ వారాహి వాహనాన్ని ఉపయోగించలేదు దీంతో తెలంగాణ జనసేన శ్రేణులు ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని ఎన్నికల ప్రచారంలోకి తీసుకురాలేదు అన్న అనుమానాలు అందరిలోనూ కలిగాయి.
ఇలా పవన్ కళ్యాణ్ వారాహి ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహించకపోవడంతో ఈ ఎన్నికలను పవన్ కళ్యాణ్ లైట్ తీసుకున్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి ఏదో ప్రచారం చేయాలి అంటే చేయాలి అన్న ఉద్దేశంతో మమ అనిపించారని జనసేన బాధ్యతలను కూడా బిజెపి పార్టీని తీసుకుందని స్పష్టంగా అర్థం అవుతుంది.
జనసేన బాధ్యతలను తీసుకున్న బిజెపి…
పవన్ కళ్యాణ్ తెలంగాణలో బిజెపితో పొత్తు కుదుర్చుకొని ఎన్నికల బరిలోకి వచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీపై విమర్శలు చేస్తున్న విధంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పై ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఏదో ఎన్నికల ప్రచారంలోకి రావాలి అంటే రావాలన్న ఉద్దేశంతోనే అలా కనిపించి వెళ్ళారు కానీ పెద్దగా ఈయనకు తెలంగాణ ఎన్నికలపై ఆసక్తి లేదని తెలుస్తుంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…