ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అటవీ ప్రాంతాలలో ఉండాల్సిన పాములు జనావాసాలలో తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు ఏదో ఒకచోట పాములు బీభత్సం సృష్టించడం గురించి వింటున్నాం. తాజాగా ఓ వ్యక్తి ఆరుబయట ఆవరణంలో నిద్రిస్తుండగా పాము ఏకంగా అతని దుప్పటిలోకి దూరిన ఘటన రాజస్థాన్ బాన్స్వాడ జిల్లాలో ఓ దేవాలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆలయ ఆవరణంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి నేలపై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే అటుగా తాచు పాము వెళ్తూ నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లో దూరింది.అయితే అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న ఆవ్యక్తి తన ఒంటిపై ఏదో పాకుతున్నట్టు అనిపించడంతో నిద్రలేచి చూశాడు. అయితే తన శరీరంపై తాచుపాము చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు.
ఈ క్రమంలోనే వెంటనే దుప్పటి పక్కకు విసిరి అక్కడి నుంచి భయంతో పరుగు పెట్టాడు. ఆ పాము కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ పాము అతని దుప్పట్లో దూరినప్పటికే అతనికి ఏమీ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అతని అదృష్టం బాగుందని, అతనికి ఇంకా భూమిపై నూకలు ఉన్నాయంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…