ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అటవీ ప్రాంతాలలో ఉండాల్సిన పాములు జనావాసాలలో తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు ఏదో ఒకచోట పాములు బీభత్సం సృష్టించడం గురించి వింటున్నాం. తాజాగా ఓ వ్యక్తి ఆరుబయట ఆవరణంలో నిద్రిస్తుండగా పాము ఏకంగా అతని దుప్పటిలోకి దూరిన ఘటన రాజస్థాన్ బాన్స్వాడ జిల్లాలో ఓ దేవాలయ ప్రాంగణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆలయ ఆవరణంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి నేలపై నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలోనే అటుగా తాచు పాము వెళ్తూ నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లో దూరింది.అయితే అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న ఆవ్యక్తి తన ఒంటిపై ఏదో పాకుతున్నట్టు అనిపించడంతో నిద్రలేచి చూశాడు. అయితే తన శరీరంపై తాచుపాము చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు.
ఈ క్రమంలోనే వెంటనే దుప్పటి పక్కకు విసిరి అక్కడి నుంచి భయంతో పరుగు పెట్టాడు. ఆ పాము కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ పాము అతని దుప్పట్లో దూరినప్పటికే అతనికి ఏమీ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. అతని అదృష్టం బాగుందని, అతనికి ఇంకా భూమిపై నూకలు ఉన్నాయంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…