Thammareddy Bharadwaja : సీనియర్ నిర్మాత, డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు సినిమాలు, సినిమా తారల గురించి మొహమాటం లేకుండా మాట్లాడుతూ వైరల్ అవుతుంటారు. తాజాగా మేజర్ సినిమా హీరో అడివి శేష్, డైరెక్టర్ శశికిరణ్ తిక్కను ఇంటర్వ్యూ చేసిన ఆయన పరోక్షంగా పాన్ ఇండియా సినిమాలపై చురకలు వేసారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు పెడుతున్న బడ్జెట్ల గురించి ప్రొడక్షన్ కాస్ట్ గురించి కామెంట్స్ చేసారు.
పాన్ ఇండియా పేరుతో కంటెంట్ లేని సినిమా…
మేజర్ సినిమాను ప్రశంసించిన తమ్మారెడ్డి, సినిమాను 30 నుండి 40 కోట్ల మధ్యలోనే ఎలా తీసారంటు ప్రశ్నించాడు. ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా పేరుతో ఎక్కువ బడ్జెట్లో తీస్తుంటే మీరు అదే క్వాలిటీ సినిమాను ఇంత తక్కువ బడ్జెట్ లో ఎలా తీస్తున్నారని అడిగారు. సమయాన్ని వృధా చేస్తూ ప్రొడక్షన్ కాస్ట్ పెంచుతున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆరు నెలలో ఒక సినిమా పూర్తి చేస్తే సినిమా తీసే ఖర్చు తగ్గుతుందని, కానీ సంవత్సరాల తరబడి సినిమా తీస్తారంటూ చురకలు వేశారు.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి కూడా సటైర్లు వేశారు తమ్మారెడ్డి. మేజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఒక పెద్ద హీరోని పిలిచి దేవుడంటూ పొగడలేదు ఎందుకు అంటూ మాట్లాడారు. సినిమా ప్రీ రిలీజ్ కి వచ్చిన హీరో మెగాస్టార్ అయినా సూపర్ స్టార్ అయినా సినిమా గురించి ప్రొమోషన్స్ చేయమంటే ఆ హీరో కి భజన చేస్తారని కనీసం సినిమా చూసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడం వల్ల గాలి మాటలు చెప్పి ఆ వచ్చిన హీరో వెళ్లిపోతున్నాడని మీరు అలా చేయనందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ మధ్యకాలంలో నార్త్ లోనూ మంచి సినిమాలు వస్తున్నాయని భూల్ భూలయ బాగుందని ఇక తెలుగులో మేజర్, మరియు తమిళ్ విక్రమ్ సినిమాలు బాగున్నాయని అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…