ఏపీలో పాఠశాలల ప్రారంభం అప్పుడే.. సెలవులు తగ్గించిన సర్కార్..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంతో పోలిస్తే వైరస్ భయం తగ్గినా రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇప్పటికే కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు సిద్ధమవుతోంది. విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం అకడమిక్ క్యాలండర్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు.

దాదాపు ఐదు నెలల పనిదినాలు తగ్గడంతో జగన్ సర్కార్ అందుకు అనుగుణంగా సిలబస్ ను తగ్గించేందుకు కసరత్తు చేస్తుండటం గమనార్హం. అదే సమయంలో విద్యార్థులకు పండగ సెలవులను తగ్గించి ఉపాధ్యాయుల సెలవులపై కూడా పరిమితిని విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. నవంబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే పాఠశాలలు ఏప్రిల్ 30 వరకు పని చేయనున్నాయి.

వారానికి ఆరు పని దినాలు ఉండే విధంగా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. సంక్రాంతి పండుగకు కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2020 ఏప్రిల్ నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉపాధ్యాయులు నెలకు రెండున్నర రోజుల సెలవు దినాలను మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎన్సీఈఆర్టీ సిలబస్ తగ్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సిలబస్ తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.

విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఇకపై పాఠశాలల హాజరు పట్టికలో కులం, మతం వివరాలు ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థినీవిద్యార్థుల పేర్లను ఒకే రంగు సిరాతో రాయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో పాటించిన విధానాలను ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago