అతడు గొర్రెలు, మేకలను ప్రతీ రోజు అడవికి తీసుకెళ్లి కాస్తాడు. అంటే గొర్రెల కాపరి అన్నట్లు. అయితే అతడికి సొంతంగా కొన్ని గొర్రెలు, మేకలు కూడా ఉన్నాయి. అయితే అతడు ఉదయం, సాయంత్రం రెండు పూటలు అతడి వద్ద ఉన్న మేకల్లో కొన్ని మేకల నుంచి పాలు పితుకుతాడు.
ఓ రోజు ఇలానే మేక దగ్గరకు వెళ్లి పాలు పితుకుతున్న క్రమంలో ఆ మంద నుంచి ఓ మేకపోతు వచ్చి అతడి తలపై తన కొమ్ములతో పొడిచింది. దీంతో అతడికి రక్త స్రావం అయింది. వెంటనే అతడిని ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. తర్వాత ఏమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. ఆ కాపరి పాలిట ఆ మేకపోతు కాల యముడైంది.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మేకల కాపరి చీకోటి చంద్రయ్య (46) గత నెల 25న తన మేకల వద్దకు పాలు పితికేందుకు వెళ్లాడు. అతడు సాధారణంగా రోజూ ఇలానే వెళ్లి పాలు పితికి ఇంట్లోకి వెళ్లేవాడు. ఆ రోజు అతడికి దురదృష్టం అలా ఉంది. పాలు పితుకుతున్న సమయంలో వెనకు నుంచి ఓ మేకపోతు వచ్చి.. కొమ్ములతో ఆ చంద్రయ్య తలపై పొడించింది.
వెంటనే అతడిని కుటుంబసభ్యులు ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. చికిత్స తీసుకున్నా తగ్గలేదు. దీంతో సిరిసిల్ల దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. అక్కడ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మరణించాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…