Geetha Singh: ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న కితకితలు హీరోయిన్… చివరికి ఇలా!
Geetha Singh: పలు తెలుగు సినిమాలలో లేడీ కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి గీతాసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించారు.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న గీతా సింగ్ వరుస అవకాశాలను అందుకొని ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా సింగ్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాననే విషయాన్ని వెల్లడించారు.
ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని నమ్మి సుమారు 10 లక్షల వరకు చిట్టి వేసి ఉన్న డబ్బును మొత్తం పోగొట్టుకున్నానని ఈమె తెలిపారు. ఇలా అప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం కోల్పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయానని తెలిపారు.అదే సమయంలో తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడయనీ తెలిపారు.
ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించానని అయితే తన సమస్యకు అది మాత్రమే పరిష్కారం కాదని, ఆ ఆలోచనను విరమించుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేశానని తెలిపారు.ఇక డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో విపరీతమైన ఆకలి వేయడంతో తినడానికి కూడా డబ్బులు లేక గుడి దగ్గర ప్రసాదం తిని ఆకలి తీర్చుకున్నాని ఈమె తెలిపారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…