Latha Mangeshkar: గాన కోకిల లతా మంగేష్కర్ స్వరం నుంచి జాలువారిన..! మోస్ట్ రొమాంటిక్ 10 పాటలు ఇవే.. !
Latha Mangeshkar: ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఈ ఉదయం 8గం.12ని. తుదిశ్వాస విడిచారు. గత 29రోజులుగా ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
గత నెల 8వ తేదీన కరోనాతో ఆమె ఆస్పత్రిలో చేరగా.. కరోనా నుంచి తర్వాత ఆమె కోలుకున్నారు. అయినా కొన్నాళ్ల వరకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆమె కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.
అయితే తర్వాత ఆమెకు మళ్లీ అస్వస్థతకు గురి కాగా.. మళ్లీ వెంటిలేటర్ మీదే చికిత్స అందించారు. ఇలా ఆమె ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఇక ఆమె మరణం పట్ల ఎంతో మంది సినీ ప్రముఖులు, గాయకులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. దీనిలో భాగంగా.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు.
ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం..
భారతదేశ సినీ సంగీత రంగానికి దశాబ్దాల పాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతా మంగేష్కర్ మరణం తీరని లోటు అని అన్నారు. ప్రముఖ గాయినిగా 980 సినిమాలకు, 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారామె. లతా 1940లలో బాలీవుడ్లోకి కాలుమోపారు. మొదట్లోనే ఎన్నో అవమానాలు. వాయిస్ బాగాలేదని తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1942లో లతకు తొలిసారిగా మంగళగౌర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. లత 1942లో మరాఠీ చిత్రం ‘కితీ హాసిల్’ లో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం చేసింది. తెలుగులో 1955 లో ఏఎన్నార్ ‘సంతానం’ కోసం నిదుర పోరా తమ్ముడా..అనే పాటతో అరంగేట్రం చేశారు. అతి తక్కువకాలంలోనే తన ప్రతిభతో ఉన్న శిఖరాల్ని అధిరోహించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…