Crime: శ్మశాన వాటికలో తన తల్లి సమాధిని తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు..ఎందుకో తెలుసా..!
Crime: భూమి మీద బతికే ప్రతీ జీవి మరణించాల్సిందే. పుట్టుక అనేది ఎంత నిజమో మరణం అనేది కూడా అంతే నిజం. కాకపోతే ఒకరు ముందు మరణిస్తారు.. మరికొంతమంది ఆలస్యంగా మరణిస్తారు. అయితే ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిని మర్చిపోలేక.. తీవ్ర మనోవేదనకు గురై శ్మశానంలో పాతి పెట్టిన తన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇవే. తమిళనాడుకు రాష్ట్రం పెరంబూరు జిల్లా కున్నం సమీపంలోని పరవై గ్రామానికి చెందని 38 ఏళ్ల బాలమురుగన్ కు పెళ్లి కాలేదు. అతడి తండ్రి పది సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటి నుంచి అతడి బాగోగులు అతడి తల్లి ముక్కాయి (65) చూసుకుంటూ ఉండేది. 10 నెలల క్రితం ఆమె తల్లి అనారోగ్యానికి గురై మరణించింది.
ఇక ఆ రోజు నుంచి అతడు ఒంటరి వాడు అయ్యాడు. ఏం చేయాలో తోచక అతడు ప్రతీ రోజు శ్మశానానికి వెళ్లి.. తన తల్లి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో తనలో తానే మాట్లాడుకునే వాడు. అక్కడే ఎన్నో సార్లు నిద్ర కూడా పోయాడు. ఒకానొక సమయంలో వర్షం పడితే సమాధి తడవకుండా ఉండేలా చూసేవాడు. అయితే ఇటీవల అతడు తన తల్లి సమాధిని తవ్వి.. అందులో పాక్షికంగా కుళ్లిపోయిన తన తల్లి శవాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.
ఇలా ఇంట్లోనే ఆ శవాన్ని ఉంచడంతో ఇళ్లంతా దుర్వాసన వచ్చింది. ఓ రోజు అతడి ఇంటికి తన బంధువు వచ్చాడు.. ఏంటి ఈ వాసన అని అడగ్గా.. అతడిని అక్కడ నుంచి పంపించేశాడు. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా.. విషయం అంతా బయటపడింది. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అక్కడ పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ నిమిత్తం బాలమురుగన్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సమక్షంలో దహనం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…