Crime: శ్మశాన వాటికలో తన తల్లి సమాధిని తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు..ఎందుకో తెలుసా..!
Crime: భూమి మీద బతికే ప్రతీ జీవి మరణించాల్సిందే. పుట్టుక అనేది ఎంత నిజమో మరణం అనేది కూడా అంతే నిజం. కాకపోతే ఒకరు ముందు మరణిస్తారు.. మరికొంతమంది ఆలస్యంగా మరణిస్తారు. అయితే ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిని మర్చిపోలేక.. తీవ్ర మనోవేదనకు గురై శ్మశానంలో పాతి పెట్టిన తన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇవే. తమిళనాడుకు రాష్ట్రం పెరంబూరు జిల్లా కున్నం సమీపంలోని పరవై గ్రామానికి చెందని 38 ఏళ్ల బాలమురుగన్ కు పెళ్లి కాలేదు. అతడి తండ్రి పది సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటి నుంచి అతడి బాగోగులు అతడి తల్లి ముక్కాయి (65) చూసుకుంటూ ఉండేది. 10 నెలల క్రితం ఆమె తల్లి అనారోగ్యానికి గురై మరణించింది.
ఇక ఆ రోజు నుంచి అతడు ఒంటరి వాడు అయ్యాడు. ఏం చేయాలో తోచక అతడు ప్రతీ రోజు శ్మశానానికి వెళ్లి.. తన తల్లి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో తనలో తానే మాట్లాడుకునే వాడు. అక్కడే ఎన్నో సార్లు నిద్ర కూడా పోయాడు. ఒకానొక సమయంలో వర్షం పడితే సమాధి తడవకుండా ఉండేలా చూసేవాడు. అయితే ఇటీవల అతడు తన తల్లి సమాధిని తవ్వి.. అందులో పాక్షికంగా కుళ్లిపోయిన తన తల్లి శవాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.
ఇలా ఇంట్లోనే ఆ శవాన్ని ఉంచడంతో ఇళ్లంతా దుర్వాసన వచ్చింది. ఓ రోజు అతడి ఇంటికి తన బంధువు వచ్చాడు.. ఏంటి ఈ వాసన అని అడగ్గా.. అతడిని అక్కడ నుంచి పంపించేశాడు. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా.. విషయం అంతా బయటపడింది. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అక్కడ పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ నిమిత్తం బాలమురుగన్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సమక్షంలో దహనం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…