Samantha: భర్త నాగ చైతన్యతో విడిపోయినప్పటి నుంచి సమంత వ్యక్తిగత జీవితం చర్చనీయాంశమైంది. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సమంతకు సంబంధించి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే విడాకుల తర్వాత ఆమె ఎక్కువగా సినిమాలపై శ్రద్ధ వహిస్తూ.. ఫుల్ బిజీ అయ్యారు. పెళ్లికి ముందు ఎలాంటి స్కిన్ షో చేయని సంమత.. మొదటి సారిగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించారు.
ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ట్రెండింగ్ ఉన్న సాంగ్ ఏదైనా ఉందంటే.. ‘ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా సాంగ్..’’మాత్రమే. అయితే ఈ పాట తర్వాత ఆమె కొన్ని సినిమాలకు సైన్ చేశారు. శాకుంతలం సినిమా తర్వాత ఆమె తదుపరి ప్రాజెక్ట్ కొరటాల శివ డైరెక్షన్లో చేయనున్నట్లు టాక్.
అయితే తాజాగా ఆమెకు సంబధించి కొన్ని గోవా ఫొటోలు వైరల్ గా మారాయి. గోవా నుంచి సమంత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె ఈ ఫొటోలో బికినీలో కనిపించింది. ఆమెతో పాటు తన స్నేహితులు డిజైనర్ శిల్పా రెడ్డి మరియు ఇతరులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె గోవా విహారయాత్రలో ఉన్నారు. 2022 కొత్త సంవత్సరం వేడుకులకు ఆమె గోవా వెళ్లినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి సామ్ నాగ చైతన్యతో కలిసి విదేశాలకు వెళ్తుంది. ఈ సంవత్సరంలోనే వాళ్లిద్దరు విడాకుల ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఇక ఈ సారి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోడానికి ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. ఆమె తన స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ ఫ్లాన్ చేసింది. అక్కడ ఆమె బికినీ ధరించి ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన ఎంతో మంది నెటిజన్లు ఇయర్ ఎండ్ ట్రీట్ మాములుగా లేదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…