Actress K.R Vijaya:దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కె.ఆర్.విజయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన ఈమె వయసు పైబడటం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇలా అగ్రతారగా తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయతన జీవితంలో చిన్నప్పుడు జరిగిన ఒక విషాద సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తూ ఆ విషయాన్ని తలచుకొని బాధపడ్డారు. ఇలా తన జీవితంలో చోటు చేసుకున్న ఆ విషాద సంఘటన ఏమిటి అనే విషయానికి వస్తే…
విజయ చిన్న వయసులో ఉన్న సమయంలో తన తల్లికి తన చెల్లికి అనారోగ్యం చేసింది .అయితే తన చెల్లెలు పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మూడు మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్లి తన చెల్లికి బాగా లేదనే విషయాన్ని కూడా డాక్టర్ కి చెప్పడానికి రాకపోవడంతో డాక్టర్ తన తల్లికి జబ్బు చేసి ఉంటుందని భావించారట.
డాక్టర్ అశ్రద్ధగా ఉంటూ ఆమె ఒంట్లో బాగా లేదని చెప్పింది వాళ్లమ్మగారికి అనుకొని, “సరే.. నేనొచ్చి చూసుకుంటాలే” అని ఆలస్యంగా వెళ్ళిన తన ఇచ్చే మందులు ఎంతో బాగా పని చేస్తాయని భావించారు. ఇలా డాక్టర్ వస్తానని చెప్పి పంపించడంతో విజయ ఇంటికి వెళ్ళింది. ఈ విధంగా ఇంటికి వచ్చిన ఆమె పడుకున్న తన చెల్లెలిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాల సీసా తీసుకుని తన చెల్లికి పాలు పట్టించింది.
అయితే ఆ చిన్నారి కళ్లు మూసుకుని ఉండడంతో నిద్రపోతోందని భావించింది విజయ. ఇక ఇది గమనించిన ఇతర కుటుంబ సభ్యులు చూసి గట్టిగా ఏడవడంతో విజయకు అప్పుడే తెలిసింది తను ఇంతవరకు చనిపోయిన తన చెల్లెకు పాలు పట్టించానని. తన చెల్లి చనిపోయిందని తెలియడంతో ఎంతో మదన పడింది.అయితే సరైన సమయానికి వైద్యం అందక పోవడం వల్ల తన చెల్లి మరణించిందని ఆరోజు ఆమె ధరించిన ఆ డ్రస్ చాలాకాలం వరకు తన దగ్గర ఉంచుకొని ఆ డ్రెస్సులో తన చెల్లిని చూసుకుంటున్నానని విజయ తెలిపారు.ఆ రోజు సరైన సమయానికి వైద్యం అంది ఉంటే తన తల్లి బతికేదని అప్పుడు అంత స్థోమత లేకపోవడం వల్ల తన చెల్లి దూరమైందని ఇప్పుడు అన్ని ఉన్నా కూడా తిరిగి తన చెల్లెలు తిరిగిరాదని విజయ చెప్పుకొచ్చారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…