The theater owner's troubles with pawan kalyan fans
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాపై రివ్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. క్రిటిక్స్ అత్యధికంగా 2 నుంచి 2.5 రేటింగ్స్ ఇచ్చారు. దీంతో యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
అయితే టాక్ ఎలా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోను ఒక పండగలా చేసుకుంటారు. థియేటర్లలో నానా హంగామా చేస్తారు. బ్యానర్లు, పూల వర్షాలు, బాణాసంచాలతోపాటు.. కొంతమంది స్క్రీన్ మీదకే ఎక్కిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో స్క్రీన్ను కూడా పగులకొడతారు. ఇది నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలకు తలనొప్పిగా మారుతోంది.
ఈ తరహా హంగామా కట్టడికి హైదరాబాద్లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్ యాజమాన్యం వినూత్న చర్యలు తీసుకుంది. స్క్రీన్ ముందు ఇనుప కంచెలతో పాటు ముళ్లతో కూడిన ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, పైన మొలలు ఉండేలా స్టీల్ స్ట్రిప్లను అమర్చారు. దీంతో ఎవరైనా దాన్ని దాటి స్క్రీన్ వైపు వెళితే గాయాలే గాక, ప్రాణాలకే ప్రమాదమవుతుందని చెబుతున్నారు.
పైన మాత్రమే కాదు, కింద కూడా భద్రతా చర్యలు తీసుకున్నారు. సీట్ల మధ్య సిమెంట్ ఇటుకలు పెట్టి, కుర్చీలు దెబ్బతినకుండా చూసుకున్నారు. థియేటర్ యాజమాన్యం తీసుకున్న ఈ భద్రతా చర్యలు, ఫ్యాన్స్ వెర్రి చేష్టలకు ఎదురుగా వారు పడుతున్న కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు “ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి”, “ఇది సినిమా.. మీ ప్రాణాలు కాదు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు, పవన్ అభిమానుల లోకం మరోసారి వార్తల్లో నిలిచింది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…