The theater owner's troubles with pawan kalyan fans
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాపై రివ్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. క్రిటిక్స్ అత్యధికంగా 2 నుంచి 2.5 రేటింగ్స్ ఇచ్చారు. దీంతో యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
అయితే టాక్ ఎలా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షోను ఒక పండగలా చేసుకుంటారు. థియేటర్లలో నానా హంగామా చేస్తారు. బ్యానర్లు, పూల వర్షాలు, బాణాసంచాలతోపాటు.. కొంతమంది స్క్రీన్ మీదకే ఎక్కిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో స్క్రీన్ను కూడా పగులకొడతారు. ఇది నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలకు తలనొప్పిగా మారుతోంది.
ఈ తరహా హంగామా కట్టడికి హైదరాబాద్లోని ప్రసిద్ధి గాంచిన సంధ్య థియేటర్ యాజమాన్యం వినూత్న చర్యలు తీసుకుంది. స్క్రీన్ ముందు ఇనుప కంచెలతో పాటు ముళ్లతో కూడిన ఫెన్సింగ్ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, పైన మొలలు ఉండేలా స్టీల్ స్ట్రిప్లను అమర్చారు. దీంతో ఎవరైనా దాన్ని దాటి స్క్రీన్ వైపు వెళితే గాయాలే గాక, ప్రాణాలకే ప్రమాదమవుతుందని చెబుతున్నారు.
పైన మాత్రమే కాదు, కింద కూడా భద్రతా చర్యలు తీసుకున్నారు. సీట్ల మధ్య సిమెంట్ ఇటుకలు పెట్టి, కుర్చీలు దెబ్బతినకుండా చూసుకున్నారు. థియేటర్ యాజమాన్యం తీసుకున్న ఈ భద్రతా చర్యలు, ఫ్యాన్స్ వెర్రి చేష్టలకు ఎదురుగా వారు పడుతున్న కష్టాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు “ఫ్యాన్స్ జాగ్రత్తగా ఉండండి”, “ఇది సినిమా.. మీ ప్రాణాలు కాదు” అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు, పవన్ అభిమానుల లోకం మరోసారి వార్తల్లో నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…