Women Reservation: ఆ మహిళలకు రిజర్వేషన్ ఉండదు..! హైకోర్టు సంచలన తీర్పు..!
Women Reservation: రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల విషయంలో సంచలన తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. సాధారణంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు అయినా.. వేరే రాష్ట్రానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటే.. ఆమెకు కూడా ఆ రాష్ట్ర రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి.
అటు విద్యారంగలోగానీ.. ఇటు ఉద్యోగాల్లో గానీ ఆ రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి. కానీ ఇక్కడ రాజస్థాన్ హైకోర్టు మాత్రం దీనిపై సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత రాజస్థాన్ వచ్చే ఇతర రాష్ట్రాల మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ కింద రిజర్వేషన్ ఉండదని తేల్చిచెప్పింది.
అయితే ఇక్కడ మరో బెన్ ఫిట్ ను కూడా పొందు పర్చారు. ఏంటంటే.. రిజర్వేషన్లు వర్తించవని చెబుతూ.. ఆయా కోటాల ఆధారణంగా లభించే ఫలాలు మాత్రం అందుతాయని తెలిపింది. సునీత అనే మహిళ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ జరిపి పై విధంగా తీర్పు ఇచ్చింది.
సునీత అనే మహిళది పంజాబ్ రాష్ట్రం. అక్కడ ఆమె రేగార్ వర్గానికి చెందిన ఎస్సీ కమ్యూనిటీకి చెందింది. ఆమె రాజస్థాన్ వచ్చి పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ రాష్ట్రంలో ఆమె ఎస్సీకి సంబంధించి సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకుంది. కానీ అతడు ఆ దరఖాస్తును తిరస్కరించాడు. దీంతో ఆమె రాజస్థాన్ హైకోర్టులో సవాల్ చేయడంతో ఈ విధంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ దినేశ్ మెహతా ఇటువంటి కేసులను 2018, 2020లో కూడా విచారించినట్లు పేర్కొన్నాడు. ఇలా పెళ్లి తర్వాత రాజస్థాన్ లో ఉండే మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కుదరదని తెలిపాడు. కుల ధ్రువీకరణ పత్రం పొందొచ్చని.. కానీ దీనిని ఉద్యోగాల్లో తప్ప మిగిలిన వాటికి ఉపయోగించుకోవచ్చని తీర్పు ఇచ్చాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…