Dasari Narayana Rao: దాసరి చనిపోయే ముందు నాతో చెప్పిన చివరి మాటలివే.. ఎమోషనల్ అయిన ధవళ సత్యం!
Dasari Narayana Rao:తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. ఈయన దర్శకుడిగా నటుడిగా నిర్మాతగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీ బరువు బాధ్యతలను కూడా తన భుజాలపై మోశారు. దాసరిగారు డైరెక్టర్ ధవళ సత్యం ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో దాసరి సహాయంతో ఈయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
అప్పటికే దాసరి నారాయణరావు ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్. ఇక ఇండస్ట్రీలో దాసరి గారి దగ్గర అలా మెలగాలి ఇలా మెలగాలి అంటూ చాలా మంది చాలా కండిషన్స్ పెట్టారు. అయితే అది నచ్చక ఇండస్ట్రీ నుంచి వెనక్కి వచ్చేద్దామని భావించాను. కానీ గురువు గారి ప్రోత్సాహంతో తాను ఇండస్ట్రీలో కొనసాగానని ధవళ సత్యం తెలిపారు. ఇద్దరం స్నేహితులమే అయినప్పటికీ తనని ఎప్పుడు గురువుగానే భావిస్తూ అన్నయ్య అంటూ పిలుస్తానని ధవళ సత్యం తెలిపారు.
ఇండస్ట్రీలో వీరిద్దరి అనుబంధం గురించి చెబుతూ దాసరి చివరి క్షణాలు గురించి కూడా ఈ సందర్భంగా దవళ సత్యం తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. దాసరి గారితో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని ఆయన చనిపోయే ముందు తన పక్కన ధవళ సత్యం అనే వాడు ఉండాలని కోరుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యారు.
దాసరి గారి చివరి రోజులలో తన పక్కన ఉండాలని పిలిపించడంతో నేను, రామకృష్ణ, రేలంగి నరసింహారావు ముగ్గరం ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వెళితే దాదాపు ఎనిమిది గంటల వరకు ఆయనతో కలిసి మాట్లాడుతూ ఆయనతోనే సమయం గడిపాము. ఒక రోజు కాస్త ఆలస్యంగా వెళితే నాతోపాటు ఉండరా.. అని అడగగా ఉంటాను అన్నయ్య అంటూ తన చేతిని ఇలా పట్టుకున్నాను. తాను కూడా నా చేతిని అలా పట్టుకొని స్ట్రేక్చర్ పై లోపలికి వెళ్ళాడు. ఇక తిరిగి రాలేదు. ఆయన అడిగాడని నేను ఉన్నాను,కానీ ఆయన తిరిగి రాలేదు అంటూ ఈ సందర్భంగా దాసరి గారి గురించి ధవళ సత్యం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…