ప్రముఖ నటుడు రామ్, హీరోయిన్ జెనీలియా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా రెడీ. ఈ చిత్రంలో హీరో రామ్ ఎనర్జీ లెవల్స్ మామూలుగా ఉండవు. నటి జెనీలియాను ప్రేమించిన రామ్, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఆమె కుటుంబసభ్యులతో ఆడిన నాటకాలు, ముఖ్యంగా బ్రహ్మానందంను ఈ చిత్రంలో బాగా వాడుకున్నారనే చెప్పాలి. ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్ చేశారో, అలాగే ఈ చిత్రంలోనూ ఓ పవర్ఫుల్ రోల్ని ఆయన ప్రదర్శించారు.
ఇకపోతే ఈ సినిమా ఆధ్యంతం కామెడీని అందిస్తూ, ప్రేక్షకులను కడుపబ్బా నవ్వించింది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను కూడా రాబట్టింది. సుమారు 17 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ సినిమా, బ్లాక్బస్టర్గా నిలిచింది. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల బాణీ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జూన్ 19, 2008న రిలీజైన ఈ మూవీకి రెండు వారాల గ్యాప్తో వచ్చిన సినిమా విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడీ సినిమాకు 13రోజుల ముందు అలీ హీరోగా నటించిన సోంబేరీ అనే సినిమా విడుదలైంది. కానీ కథాబలం అంతగా ఆకట్టుకోకపోవడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. దీని తర్వాత జూన్ 13న రెడీ సినిమాకు 6 రోజుల ముందుగా విశ్వనటుడు కమల్ హాసన్ తీసిన దశావతారం రిలీజైంది. భారీ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం మొదట విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత అందరిచేత మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత హీరో రాజశేఖర్ నటించిన గోరింటారు. చెల్లెలి సెంటిమెంట్కు పెద్దపీట వేస్తూ తీసిన ఈ సినిమాలో అన్నపై అంతులేని అభిమానమున్న చెల్లెలిగా హీరోయిన్ మీరా జాస్మిన్, అలాగే వారిని విడదీయాలని చూసే క్యారెక్టర్లో ఆర్తి అగర్వాల్ నటించారు. కుటుంబ కథాచిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఇలా మొత్తంగా రెడీ సినిమాతో రామ్ నంబర్ 1 పొజిషన్లో ఉండగా, ఆ తర్వాత గోరింటాకు’తో రాజశేఖర్, కమల్ హాసన్ దశావతారంతో విజయం సాధించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…