Virataparvam 3 days Collections: వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ సంపాదించుకుంది కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజులలో ప్రదర్శితం అవుతూ ఎంతమేర కలెక్షన్లను రాబట్టిందనే విషయానికి వస్తే..మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి రూపాయల షేర్స్ కూడా రాబట్టలేని ఈ సినిమా రెండవ రోజు 63 లక్షలు మూడవరోజు 56 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు గాను. 2.09 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్టాప్ ఆఫ్ భారత్, ఓవర్సీస్ అన్ని కలిపి మూడు రోజుల్లో రూ. 3.14 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
ముందుగా ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డిజిటల్ స్క్రీన్ పై విడుదల చేయాలని భావించారు. ఇలా ఓటిటిలో విడుదలకు భారీ మొత్తంలోనే ఆఫర్ వచ్చింది. ఈ సినిమాకు సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఆఫర్ వచ్చినప్పటికీ, ఈ సినిమా ఓటిటిలో కాకుండా థియేటర్లో విడుదల అయినా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఏరియాలలో కలిపి 14 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 14.5 కోట్ల రూపాయలను రాబట్టాలి. అయితే ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 3.14 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. మొత్తంగా రూ. 11.36 కోట్లు రావాల్సి ఉంది.ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో కలెక్షన్లను చూస్తే టార్గెట్ చేరుకోవడం కష్టతరంగా మారుతోంది. ఇలా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక ఈ సినిమా కలెక్షన్ల విషయంలో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని పలువురు భావిస్తున్నారు.
మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి! - పురాణపండ శ్రీనివాస్ మహావీరుడైన హనుమ సాధనతో ధైర్యంగా కదం తొక్కాలి!వేల…
తెలుగు, తమిళ సినీ ప్రపంచంలో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ జీవితం…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్…
తెలుగు సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జేడీ చక్రవర్తి మరోసారి తన వ్యాఖ్యలతో…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల సమయంలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు…