మనలో చాలా మంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సైతం మందులు వాడటం అలవాటు చేసుకున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఈ మందులను వాడుతూనే ఉండాలి. నిత్యం ఈ మందులు వాడుతున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం.ఈ విధంగా మందులు వాడేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అయితే మందులను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం…
మనం ఏదైనా మందులు లేదా మాత్రలను తీసుకుంటున్నప్పుడు వాటిపై ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఏదైనా ప్రిస్క్రిప్షన్ తీసుకుని మందులు కొనుగోలు చేసేటప్పుడు అవి సరైన కదా అని చెక్ చేసుకోవడం ఎంత అవసరం. కొందరు టాబ్లెట్ మాత్రమే కాకుండా సిరప్ కూడా వాడుతుంటారు.ఈ విధంగా వాడేవారు డాక్టర్లు సూచించిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా సిరప్ బాటిల్ మూతలను పూర్తిగా మూసి వేయాలి. లేదంటే ఆ మందులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మనం వాడే మందులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. వాటిని తగినంత ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఆ విధంగా నిల్వ చేసుకున్నప్పుడు మాత్రమే ఔషధాలు వాడినప్పటికీ మన శరీరానికి పని చేస్తాయి.ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మందులను నిల్వ ఉంచినప్పుడు వాటి ప్రభావం మన శరీరంపై చూపకుండా ఇతర సమస్యలను తలెత్తేలా చేస్తాయి. డయాబెటిస్ తో బాధపడే వారు ఇన్సులిన్ ను తప్పనిసరిగా ఫ్రిజ్ లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రిజ్ అందుబాటులో లేనివారు ఒక కుండలో నీటిని పోసి అందులో భద్రపరచుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలను పాటించడం ద్వారా మనం వాడే మందులు, టాబ్లెట్ ల నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…