మారుతున్న కాలంతో పాటే టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దొంగలు కూడా ఇళ్లకు వెళ్లి దొంగతనాలు చేయడం మాని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఎక్కడో ఒకచోట మినహా దొంతనాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. అయితే తాజాగా ఒక ఇంటికి దొంగతనానికి వెళ్లిన దొంగ తన తెలివితక్కువతనంతో సులభంగా దొరికిపోయాడు.
దొంగ చేసిన తప్పే అతనిని పట్టించింది. ఆ వ్యక్తి దొంగతనం చేయడానికి వెళ్లి అదే ఇంట్లో నిద్రపోయి గురక పెట్టడంతో ఇంటి సభ్యులకు సులభంగా దొరికిపోయాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గోకవరానికి చెందిన సత్తి వెంకటరెడ్డి అనే వ్యక్తికి పెట్రోల్ బంకు ఉండేది. రోజూలానే వెంకట్ రెడ్డి రాత్రి 10.15 గంటలకు పెట్రోల్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించుకుని ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు.
వెంకట్ రెడ్డి క్యాష్ బ్యాగ్ ను కొట్టేద్దామని ముందుగానే ప్లాన్ వేసిన దొంగ ప్లాన్ ప్రకారం వెంకట రెడ్డితో పాటే ఇంట్లోకి దూరాడు. ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం దొంగ ఒక మంచం కింద దూరాడు. అయితే దొంగతనం చేయాలని వచ్చిన దొంగ అప్పటికే అలసిపోయి ఉండటంతో మంచం కిందే నిద్రపోయాడు. దొంగ గురక పెట్టడంతో వెంకటరెడ్డికి మెలుకువ వచ్చింది.
గదిని పరిశీలించగా మంచం కింద దొంగ దాక్కున్నాడని గుర్తించారు. తన భార్యకు విషయం చెప్పి తలుపుకు గడియ పెట్టి వెంకటరెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని దొంగ ముఖానికి క్యాప్ తీసి తమకు బాగా పరిచయం ఉన్న సోడమల్లి సూరిబాబు దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. పోలీసుల విచారణలో డబ్బు అవసరం కావడంతో దొంగతనానికి ప్రయత్నించానని సూరిబాబు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…