మనం చాలా సంవత్సరాల నుంచి భూగ్రహం అంతం కానుందనే వార్తలు వింటూనే ఉన్నాం. 2012 సంవత్సరానికి ముందు భూగ్రహం అంతం కాబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది అప్పట్లో ఆ వార్తలు నిజమని నమ్మినా అవి నిజం కాలేదు. అయితే తాజాగా మళ్లీ భూమి అంతం కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి 2068లో భూమి అంతం కానుందని.. ఇందుకు ఒక ముఖ్యమైన కారణమే ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలం భూమిని ఢీ కొట్టబోతుందని ఆ కారణం వల్లే భూమి అంతం కాబోతుందని తెలుపుతున్నారు. ఖగోళ పరిశోధకులు ఈ వార్తను వట్టి పుకారుగా భావించవద్దని ఆధారాలు ఉండటం వల్లే ఈ విషయం చెబుతున్నామని వెల్లడిస్తున్నారు. అపోఫిస్ -99942 అనే గ్రహ శకలం భూమికి అతి దగ్గరగా వస్తోందని.. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి 400 మీటర్ల దూరం వరకు ఈ గ్రహశకలం వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 16 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. 2029 సంవత్సరంలో ఈ గ్రహశకలం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తుందని తెలుపుతున్నారు. 1 : 150 నిష్పత్తిలో ఈ గ్రహశకలం భూమి ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈసారి వస్తున్న వార్తలు శాస్త్రీయ ఆధారాలతో చెబుతున్నవని.. అందువల్ల గత అంచనాలతో పోల్చి చూస్తే ఇది చాలా ఖచ్చితమైన తేదీ అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే 2068 సంవత్సరాం రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో చాలామంది ఈ వార్తలను పట్టించుకోవడం లేదు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…