మనం చాలా సంవత్సరాల నుంచి భూగ్రహం అంతం కానుందనే వార్తలు వింటూనే ఉన్నాం. 2012 సంవత్సరానికి ముందు భూగ్రహం అంతం కాబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది అప్పట్లో ఆ వార్తలు నిజమని నమ్మినా అవి నిజం కాలేదు. అయితే తాజాగా మళ్లీ భూమి అంతం కాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి 2068లో భూమి అంతం కానుందని.. ఇందుకు ఒక ముఖ్యమైన కారణమే ఉందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శాస్త్రవేత్తలు ఒక గ్రహశకలం భూమిని ఢీ కొట్టబోతుందని ఆ కారణం వల్లే భూమి అంతం కాబోతుందని తెలుపుతున్నారు. ఖగోళ పరిశోధకులు ఈ వార్తను వట్టి పుకారుగా భావించవద్దని ఆధారాలు ఉండటం వల్లే ఈ విషయం చెబుతున్నామని వెల్లడిస్తున్నారు. అపోఫిస్ -99942 అనే గ్రహ శకలం భూమికి అతి దగ్గరగా వస్తోందని.. ఈ గ్రహశకలం భూమిని ఢీ కొట్టనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమికి 400 మీటర్ల దూరం వరకు ఈ గ్రహశకలం వచ్చే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 16 సంవత్సరాల క్రితమే శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. 2029 సంవత్సరంలో ఈ గ్రహశకలం భూమి నుంచి స్పష్టంగా కనిపిస్తుందని తెలుపుతున్నారు. 1 : 150 నిష్పత్తిలో ఈ గ్రహశకలం భూమి ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఈసారి వస్తున్న వార్తలు శాస్త్రీయ ఆధారాలతో చెబుతున్నవని.. అందువల్ల గత అంచనాలతో పోల్చి చూస్తే ఇది చాలా ఖచ్చితమైన తేదీ అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే 2068 సంవత్సరాం రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో చాలామంది ఈ వార్తలను పట్టించుకోవడం లేదు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…