Life Style: దాహం వేసి చచ్చిపోతున్నా ఈ పక్షి నీళ్లు తాగదు..! ఎందుకో తెలుసా..!
Life Style: భూమిపై బతికి ఉన్న ప్రతీ జీవికి తినడానికి తిండి.. తాగడానికి నీళ్లు.. బతకడానికి గాలి అత్యంత అవసరం. ఈ మూడు యూనివర్సల్ నీడ్స్ అంటారు. ఇవి ఉంటే.. ఏ జీవి అయినా ఈ భూమిపై బతకొచ్చు. అలా అయితే ఈ ధరణిపై మనుగడ సాగుతుంది.
ఎంత దాహం వేసినా.. చచ్చిపోవాల్సి వచ్చినా.. నీరు తాగకుండా ఉంటే ఓ పక్షి ఉందన్న సంగతి మీకు తెలుసా.. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మాత్రమే జీవించే చాతక పక్షి గురించి చాలామందికి తెలియకపోవచ్చు.
ఇది మన దేశంలో ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. దీనిని అక్కడి స్థానికులు ఎక్కువగా చోళీ అని పిలుస్తుంటారు. ఉత్తరాఖాండ్ లోని ఎక్కువగా ఈ పక్షులు గర్వాల్ అనే ప్రాంతంలో నివసిస్తాయి. ఇక ఈ పక్షికి తాగమని నీళ్లు ఇచ్చినా.. నది లేదా చెరువు వద్దకు వెళ్లి ఉంచినా.. ఈ పక్షి నీళ్లను తాగదు.
మరి నీరు తగకుండా ఈ భూమిపై ఏ జీవి మనుగడ ఉండదు కదా.. మరి అది ఎలా బతుకుతుంది అనే అనుమానం మనకు కలగొచ్చు. పాయింట్ కి వస్తే.. అది నీరు తాగుతుంది.. ఎప్పుడంటే.. వర్షపు నీటిని మాత్రమే అది తాగుతుంది. ఇది నీరు తాగే సమయంలో ముక్కును తెరవదట. అది స్వాతి నక్షత్రంలో కురిసే నీటిని మాత్రమే తాగుతుందని స్థానికులు చెబుతుంటారు. అంతే కాదు దాని చూపు అంతా ఆకాశం వైపు మాత్రమే ఉంచుతుందట. ఇలా ఈ పక్షికి ఎంత దాహం వేసినా ఓర్చుకుంటుంది కానీ.. ఏ సరస్సుల్లో నీరు మాత్రం తాగదు. ఇక ఈ పక్షిని మార్వాడీలో మఘ్వా లేదా పాపియా అని కూడా అంటారట. భలే వింతగా ఉంది కదా.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…