సూపర్ స్టార్ రజనీకాంత్ .. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. చిత్ర నిర్మాత ఆర్ బాల్కీ.. కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 28 ఏళ్ల తర్వాత లెజెండరీ కాంబో ఒక్కటవుతుంది. ఈ వార్త సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) తర్వాత.. రజనీ అభిమానులు తమ అభిమాన సూపర్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాండిరాజ్, వెంకట్ప్రభుతో పాటు పులువురు దర్శకులు రజనీకాంత్కు కథలు వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఆర్.బాల్కీ ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట.. సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో .. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఈ పాన్-ఇండియా లెవల్లో తీయనున్నారట. ఈ సినిమాకే ఇళయరాజా సంగీతాన్ని వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీ, ఇళయరాజా కాంబో కలిసి ఈ సినిమా చేస్తుండటం.. 28 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య సినిమా వస్తుండటంతో అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు. చిత్ర నిర్మాత ఆర్.బాల్కీ గురించి మాట్లాడుతూ.. అతను అమితాబ్ బచ్చన్ చీనికమ్, షమితాబ్, పా వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను అక్షయ్ కుమార్తో కలిసి ప్యాడ్మాన్ మరియు మిషన్ మంగళ్లో కూడా పనిచేశాడు.
ఈ చిత్రనిర్మాత ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించడంలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రజినీ ప్రాజెక్ట్ మొదలవ్వబోతోంది. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చత్రం అన్నాత్తే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చకున్నా.. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…