సూపర్ స్టార్ రజనీకాంత్ .. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. చిత్ర నిర్మాత ఆర్ బాల్కీ.. కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 28 ఏళ్ల తర్వాత లెజెండరీ కాంబో ఒక్కటవుతుంది. ఈ వార్త సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) తర్వాత.. రజనీ అభిమానులు తమ అభిమాన సూపర్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాండిరాజ్, వెంకట్ప్రభుతో పాటు పులువురు దర్శకులు రజనీకాంత్కు కథలు వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఆర్.బాల్కీ ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట.. సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో .. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఈ పాన్-ఇండియా లెవల్లో తీయనున్నారట. ఈ సినిమాకే ఇళయరాజా సంగీతాన్ని వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీ, ఇళయరాజా కాంబో కలిసి ఈ సినిమా చేస్తుండటం.. 28 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య సినిమా వస్తుండటంతో అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు. చిత్ర నిర్మాత ఆర్.బాల్కీ గురించి మాట్లాడుతూ.. అతను అమితాబ్ బచ్చన్ చీనికమ్, షమితాబ్, పా వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను అక్షయ్ కుమార్తో కలిసి ప్యాడ్మాన్ మరియు మిషన్ మంగళ్లో కూడా పనిచేశాడు.
ఈ చిత్రనిర్మాత ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించడంలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రజినీ ప్రాజెక్ట్ మొదలవ్వబోతోంది. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చత్రం అన్నాత్తే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చకున్నా.. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…