సూపర్ స్టార్ రజనీకాంత్ .. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా.. చిత్ర నిర్మాత ఆర్ బాల్కీ.. కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 28 ఏళ్ల తర్వాత లెజెండరీ కాంబో ఒక్కటవుతుంది. ఈ వార్త సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అన్నాత్తే(తెలుగులో పెద్దన్న) తర్వాత.. రజనీ అభిమానులు తమ అభిమాన సూపర్ స్టార్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాండిరాజ్, వెంకట్ప్రభుతో పాటు పులువురు దర్శకులు రజనీకాంత్కు కథలు వినిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు ఆర్.బాల్కీ ఇటీవల రజనీని కలిసి ఓ కథను వినిపించారట.. సామాజిక ఇతివృత్తంతో దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చడంతో .. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుకానున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని ఈ పాన్-ఇండియా లెవల్లో తీయనున్నారట. ఈ సినిమాకే ఇళయరాజా సంగీతాన్ని వహిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీ, ఇళయరాజా కాంబో కలిసి ఈ సినిమా చేస్తుండటం.. 28 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య సినిమా వస్తుండటంతో అభిమానులు ఉబ్బితబ్బిపోతున్నారు. చిత్ర నిర్మాత ఆర్.బాల్కీ గురించి మాట్లాడుతూ.. అతను అమితాబ్ బచ్చన్ చీనికమ్, షమితాబ్, పా వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతను అక్షయ్ కుమార్తో కలిసి ప్యాడ్మాన్ మరియు మిషన్ మంగళ్లో కూడా పనిచేశాడు.
ఈ చిత్రనిర్మాత ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించడంలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత రజినీ ప్రాజెక్ట్ మొదలవ్వబోతోంది. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చత్రం అన్నాత్తే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. మిశ్రమ స్పందన తెచ్చకున్నా.. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాల జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…