Bigg Boss OTT Telugu: బుల్లితెర ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధమవుతోంది. మొదటిసారిగా ఈ కార్యక్రమం తెలుగులో ఓటీటీలో ప్రసారం కావడంతో చాలామంది ఈ కార్యక్రమంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రసారం కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో ఇదివరకే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో పాల్గొన్నవారు పాల్గొంటున్నారని అలాగే మరికొందరు పేర్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి అందులో ఎవరున్నారనే విషయానికి వస్తే…
ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు…కమెడియన్ ధనరాజ్, ముమైత్ ఖాన్, ఆదర్శ్ తనీష్ ,తేజస్వి ,అషు రెడ్డి ,అరియానా గ్లోరి ,మహేష్ విట్టా, సరయు, హమీదా, నటరాజ్ మాస్టర్.ఇక ఈ కార్యక్రమంలో కొత్తగా పాల్గొనే కంటెస్టెంట్ ల విషయానికి వస్తే…యూట్యూబర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, RJ చైతు, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ
కప్పు ముఖ్యం బిగులూ ఫేమ్ వెంకట్ వంటి 17 మంది కంటెస్టెంట్ లో పాల్గొన్నబోతున్నట్లు సమాచారం. అయితే ఈ కంటెస్టెంట్ గురించి అధికారికంగా తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…