Rajashekar: ధ్రువ సినిమాలో రాజశేఖర్ నటించక పోవడానికి అసలు కారణం ఇదే!
Rajashekar: హీరో రాజశేఖర్ తన మూడు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా యాక్షన్ చిత్రాలలోను, కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకున్నారని చెప్పాలి.
రాజశేఖర్ పలు చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన శేఖర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రాన్ని రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే హీరో రాజశేఖర్ జీవిత దంపతులు ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజశేఖర్ ఎన్నో విశేషాలను అలీతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తనకు సినిమాల్లో నటించాలని ఎంతో ఇష్టం ఉండేదని అయితే తనకు నత్తి ఉన్న కారణంగా సినిమాలలో రాణించలేననే భయం కూడా ఉండేదని రాజశేఖర్ తెలిపారు. అయితే తను ఎంతో శిక్షణ తీసుకొని తనపై తనకు నమ్మకం కలిగినప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత రాజశేఖర్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నిజానికి ధ్రువ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి పాత్రలో రాజశేఖర్ అయితే బాగుంటుందని సురేందర్ రెడ్డిని అడిగినప్పుడు అతను కాదన్నారు.అందుకే ఆ సినిమాలో రాజశేఖర్ నటించలేక పోయారని ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు. అయితే మంచి నైపుణ్యం ఉన్న విలన్ పాత్రలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని రాజశేఖర్ ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…