నందమూరి నటసింహం బాలకృష్ణ తన 107 వ చిత్రంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి ముందుగా దర్శకుడు శృతిహాసన్ ను సంప్రదిస్తే ఆమె నో చెప్పినట్లు సమాచారం. అయితే గోపీచంద్ తనను కన్విన్స్ చేయడం వల్ల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్ దర్శకుడు అడగడంతో కాదనలేకపోయింది.
ఈ సినిమా కోసం శృతి హాసన్ ఒప్పుకోవడమే కాకుండా ఎన్నో కండిషన్ లు పెట్టింది. అదేవిధంగా ఏకంగా తను రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెంటనే ఆమె అడిగిన రెమ్యునరేషన్ చెల్లించడమే కాకుండా ఆమె పెట్టిన కండిషన్లకు దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇందులో గ్లామరస్ పాత్రలో డాన్స్ చేయడానికి, నటించడానికి తనకు అభ్యంతరం లేకపోయినా ఎక్కువగా టచింగ్, హగ్గులు వంటివి ఉండకూడదని, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనని ఈమె కండిషన్ పెట్టిందట. అదేవిధంగా ఈ సినిమాలో తన పాత్ర ఎంతో హుందాగా ఉండాలని ఈమె దర్శకుడికి చెప్పినట్లు సమాచారం.ఈమె పెట్టిన షరతులు అన్నింటికీ ఒప్పుకున్న దర్శకుడు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇకపోతే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…