Tirumala: కలియుగ దైవం అయినటువంటి తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా బిఆర్ నాయుడు ఎంపికైన విషయం తెలిసినదే.
ఇలా ఈయన చైర్మన్గా ఎంపికైన తర్వాత మొదటిసారి పాలక మండల సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో భాగంగా తిరుమలలో కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు ముఖ్యంగా ఆలయ ప్రతిష్టతను కాపాడటం కోసం ఆలయ ప్రాంగణంలో ఎవరు కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడకూడదని తెలిపారు.
ఇలా పాలకమండలి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని భక్తులు కూడా స్వాగతిస్తున్నారు ఆలయ ప్రతిష్టతను కాపాడాలి అంటే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈ నిర్ణయం పట్ల భక్తులు కూడా సానుకూలంగా వ్యవహరించారు. అయితే బోర్డు సభ్యులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయని తెలుస్తోంది.
రేపటి నుంచి తిరుమల ఆలయానికి వెళ్లినటువంటి రాజకీయ నాయకులైన ఇతర భక్తులు అయిన ఆలయ ప్రాంగణంలో రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడిన అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న కూడా వారిపట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై తిరుమల ఆలయానికి వెళ్లినవారు అక్కడ స్వామి వారి గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప రాజకీయాలకు తావు లేదని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…