Tirumala: కలియుగ దైవం అయినటువంటి తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా బిఆర్ నాయుడు ఎంపికైన విషయం తెలిసినదే.

ఇలా ఈయన చైర్మన్గా ఎంపికైన తర్వాత మొదటిసారి పాలక మండల సభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో భాగంగా తిరుమలలో కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చారు ముఖ్యంగా ఆలయ ప్రతిష్టతను కాపాడటం కోసం ఆలయ ప్రాంగణంలో ఎవరు కూడా రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాట్లాడకూడదని తెలిపారు.
ఇలా పాలకమండలి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని భక్తులు కూడా స్వాగతిస్తున్నారు ఆలయ ప్రతిష్టతను కాపాడాలి అంటే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఈ నిర్ణయం పట్ల భక్తులు కూడా సానుకూలంగా వ్యవహరించారు. అయితే బోర్డు సభ్యులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు నేటి నుంచి అమలులోకి రాబోతున్నాయని తెలుస్తోంది.

Tirumala: రాజకీయాలకు చోటు లేదు..
రేపటి నుంచి తిరుమల ఆలయానికి వెళ్లినటువంటి రాజకీయ నాయకులైన ఇతర భక్తులు అయిన ఆలయ ప్రాంగణంలో రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడిన అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న కూడా వారిపట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇకపై తిరుమల ఆలయానికి వెళ్లినవారు అక్కడ స్వామి వారి గురించి మాత్రమే మాట్లాడాలి తప్ప రాజకీయాలకు తావు లేదని తెలుస్తోంది.



























