జాతిరత్నాలు, 2021 మార్చి 11న విడుదలైన తెలుగు కామెడీ సినిమాస్వప్న సినిమా బ్యానరులో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకి అనుదీప్ కెవి దర్శకత్వం వహించాడు. ఇందులో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా, మురళి శర్మ, నరేష్ తదితరులు నటించగా, రధన్ సంగీతం అందించాడు. ముగ్గురు హ్యాపీ-గో-లక్కీ యువకుల చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమా మంచి సమీక్షలను అందుకుంది, సినిమాలోని కామెడీతో,ముఖ్య నటుల నటనతో ప్రసంశలు పొందింది. నవీన్, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ ముగ్గురి త్రయం తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.
ప్రియదర్శి హైదరాబాదులో జన్మించాడు. తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెసర్. ఈయన కవితలు, పద్యాలు రాసేవాడు. తల్లి జయలక్ష్మి గృహిణి. ప్రియదర్శి హైదరాబాదు విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్ లో పి. జి. చేశాడు. ఇతనికి చిన్నతనం నుంచి సినిమాల మీద ఆసక్తి ఉంది. ప్రియదర్శి చెల్లెలు నావికాదళంలో లెఫ్టినెంట్ కమాండర్. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రి. ఈమె స్వస్థలం ఆగ్రా సమీపంలో బృందావనం. ప్రియదర్శి నాన్న ఖమ్మం వాస్తవ్యులు. తల్లి గుంటూరుకు చెందినవారు.
పెళ్లి కాకముందు ప్రియదర్శి వాళ్ల నాన్న సుబ్బాచారి ఒక శుభకార్యం కోసం గుంటూరు వెళ్ళినప్పుడు ప్రియదర్శి వాళ్ళ అమ్మగారిని చూశారు. అలా బంధువుల ప్రోత్బలంతో ఆమెను వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో నివాసముంటున్న సమయంలో ఏడాదిన్నర బాబుతో సుబ్బాచారి ప్రియదర్శిని ఎత్తుకొని ఓ ఫోటో దిగారు. కట్ చేస్తే ఆ ఫోటో ఇలా మీ ముందుకు వచ్చింది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…