Sreekanth: సినీ నటుడు శ్రీకాంత్ ఎన్నో కుటుంబ కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రేక్షకులను సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈయన హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు తన కెరీర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
గతంలో శ్రీకాంత్ ఊహ విడిపోతున్నారు అంటూ వీరి విడాకుల గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్ల గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ నేను ఊహ అరుణాచలం వెళ్తున్నాము అనుకోకుండా టీవీలో మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాము అంటూ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది దీంతో ఒక్కసారిగా షాక్ అయి వెంటనే ఫోన్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చానని తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిస్తున్నటువంటి ఈయనకు బాలీవుడ్ అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక సినిమా వేడుకలో సీనియర్ నటి రాశి తో కలిసి పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే వేదికపై ఒక్కసారిగా శ్రీకాంత్ ను రాశి కొట్టిన సంగతి మనకు తెలిసిందే.
అమ్మా అని పిలిచాను..
అప్పట్లో ఈ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రాశి ఎందుకు శ్రీకాంత్ ను కొట్టిందనే విషయం గురించి తాజాగా ఈయన తెలిపారు. ఆ సినిమా వేడుకలో భాగంగా హీరోయిన్ రాశి వద్దకు వచ్చి తనని మేడమ్ అని కాకుండా అమ్మ అంటూ పిలిచారు. హీరోయిన్ అలా పిలవడంతో నేను కూడా సరదాగా రాశిని ఆటపట్టించడం కోసం అమ్మ అంటూ పిలిచాను దాంతో ఆమె నన్ను కొట్టింది అంటూ ఈ సందర్భంగా శ్రీకాంత్ ఆ సంఘటన గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…