Tollywood heroine Rekha Vedavyas about her health and marriage
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు రేఖ వేదవ్యాస్. టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా, తనదైన ముద్ర వేసుకున్న ఈ భామ, 2001లో ‘ఆనందం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి, ఆ తర్వాత ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘దొంగోడు’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’, ‘ప్రేమించుకున్నాం’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకప్పుడు యూత్కి కలల రాణిగా మారిన రేఖ, తన అందం, అభినయంతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.
అయితే తెలుగులో అవకాశాలు తక్కువ రావడంతో ఆమె ఎక్కువగా కన్నడ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కెరీర్ మంచి ఊపుమీద ఉన్న సమయంలోనే అనూహ్యంగా సినిమా ప్రపంచానికి గుడ్ బై చెప్పింది. 2014 తర్వాత ఆమె వెండితెరపై కనిపించకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
అనంతరం ఓ రియాలిటీ షోలో పాల్గొన్న రేఖ, బక్కచిక్కిన శరీరంతో, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపంతో అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితం, అనుభవాల గురించి ఓపెన్గా మాట్లాడింది.
బెంగళూరులో పుట్టిన, పెరిగిన రేఖ, కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ ప్రారంభించిందట. ఆ తర్వాత తెలుగు, కన్నడ సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ముంబైలో నివసిస్తూ, మళ్లీ నటన రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది.
ఆమె మాట్లాడుతూ, “వ్యక్తిగత కారణాల వల్ల 2014 నుంచి 2020 వరకూ సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నాను. కోవిడ్ రాకముందే మళ్లీ నటించాలనే ఆలోచన వచ్చింది. టెలివిజన్ షోలో కూడా పాల్గొన్నాను. కానీ అప్పుడే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత అనారోగ్యంతో తీవ్రంగా బాధపడ్డాను. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా పూర్తిగా కుంగిపోయాను. నిజంగా నరకాన్ని అనుభవించాను. మళ్లీ కోలుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. ఆ ఆరోగ్య సమస్య వల్ల ఎంతో బాధపడ్డాను. అంతటి ప్రభావం చూపించగలదని అప్పుడు తెలిసింది” అని వెల్లడించింది.
“ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోలేదు. ఈ మధ్య విడాకులు పెరిగిపోతున్నాయి. అందుకే సరైన వ్యక్తి దొరికిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” అని తెలిపింది.
మళ్లీ వెండితెరపై మెరిపించేందుకు సిద్ధమవుతున్న ఈ నటికి అభిమానులు ఇప్పటికే ఎగిరి గంతేస్తున్నారు. రేఖ వేదవ్యాస్ రీ ఎంట్రీతో మరోసారి టాలీవుడ్కి ఓ టాలెంటెడ్ బ్యూటీ తిరిగి వస్తుందన్న ఆశ జనం మనసుల్లో చిగురిస్తోంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…