హీరో ఉదయ్ కిరణ్.. ప్రతీ ఒక్కరికీ అతడు సుపరిచితమే. ‘చిత్రం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఆ సినిమాతోనే ఎంతో మంది తెలుగులో ఇప్పటికీ నటులు కొనసాగుతున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా.. తన సొంత ట్యాలెంట్ పై నిలపడ్డాడు ఉదయ్ కిరణ్.
అతి కొద్ది సమయంలోనే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. కొంత మంది సినీ పెద్దలు అతడికి అవకాశాలు లేకుండా చేశారనేది వార్తలు వినిపించాయి. ఆ కారణంగానే తను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అతడు విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా అతడికి సనిమా అవకాశాలు దగ్గాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదరయ్యాయి.
ఇక సంసార జీవితంతో కూడా అతడికి గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు
తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై.. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అతడికి సంబంధించి ఓ లేఖ వైరల్ గా మారింది. అతడు చనిపోయేముందు ఆ లేఖ రాశారు. ఆ లెటర్ చదివి చాలా మంది ఎంతో బాధపడ్డారు. ఇంతకీ ఆలేఖలో ఏముందంటే.. ‘‘విషిత.. మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో.. అంతటి స్థాయిలో నువ్వంటే కూడా ఇష్టం. మన మధ్య జరుగుతున్న గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వారికి ఆ బాధ ఉండకూడదు.. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు.. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే లోపు నీ పక్కన ఉదయ్ ఉండడు అంటూ అందులో పేర్కొన్నారు.
నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధపడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా..’’ అంటూ తన చివరి లేఖను రాశాడు. ఈ లేఖ ను చదివిన ఉదయ్ కిరణ్ అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…