Featured

గిరిబాబు రెండో కొడుకు కూడా సినిమా నటుడే అనే విషయం తెలుసా.?!

ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం లో పుట్టి పెరిగిన శేషగిరిరావుకు నాటకాలంటే ఎంతో ఇష్టం. ఆయన నటనపై ఇష్టంతోనే మద్రాస్ వెళ్లి సినిమా రంగంలో ప్రవేశించాడు. అలా 1973లో జగమే మాయ సినిమా ద్వారా సినిమాల్లోకి తెరంగేట్రం చేశాడు. 1977లో దేవతలారా దీవించండి అనే సినిమాతో నిర్మాతగా మారారు. జయభేరి నిర్మాణ సంస్థలో మూడు నాలుగు సినిమాలు తీసినప్పటికీ దానిని హీరో మురళీమోహన్ కి అప్పగించడం జరిగింది.

ఆ తరువాత దక్షిణాది భాషల్లో 500 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించారు. అందులో దాదాపు 150 చిత్రాలు సూపర్ స్టార్ కృష్ణవే ఉండడం ఒక విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అనేక సినిమాల్లో నటిస్తూ ఆయన తెలుగు ప్రేక్షకులను ఆనందింప చేశారు. నాటకాలు వేస్తున్న సమయంలోనే నాటకాలు ఎలా వేయాలి, ఏ పాత్ర ఎలా తీర్చిదిద్దాలి అనే అంశాలపై గిరిబాబు కు మంచి అవగాహన ఉండేది. ఆ క్రమంలో సినిమాలో విలన్ గా చేస్తున్న సమయంలోనే సినిమా నిర్మాణం, దర్శకత్వం వైపు తన ఆలోచన ధోరణి వెళుతూ ఉండేది. దర్శకుడిగా మారిన తర్వాత కౌబాయ్ చిత్రాలవైపు గిరి బాబు మొగ్గు చూపడం జరిగింది. ఆ క్రమంలో 1990 లో తన రెండో కొడుకు అయినా బోసు బాబు తో ఇంద్రజిత్ అనే సినిమాను నిర్మించడం జరిగింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని చవిచూసింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం తర్వాత కౌబాయ్ గా వచ్చిన ఏ చిత్రం కూడా దాదాపు హిట్ కాలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత గిరి బాబు మొదటి కొడుకు రఘు బాబు సినిమాల్లోకి రావడం జరిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా హాస్యనటుడిగా రఘు బాబు గిరిబాబు తర్వాత ఎక్కువగా సినిమాలలో నిలదొక్కుకోగలిగారు. అయితే బోసు బాబు హీరోగా నటించిన ఇంద్రజిత్ మూవీ పరాజయం పొందడంతో అప్పుడే నటుడు ప్రభాకర్ రెడ్డి టీవీ సీరియల్స్ చేస్తుండడంతో అటువైపు గిరిబాబు వెళ్లడం జరిగింది. ఆ తర్వాత గిరిబాబు సినిమాల్లో హీరో,హీరోయిన్లకు కు తండ్రిగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆనందింప చేస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago